Breaking News

Daily Archives: January 3, 2025

జాతీయ వాలీబాల్ పోటీలకు చురుగ్గా ఏర్పాట్లు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 6 వ తేదీ నుంచి పిబి సిద్ధార్థ కాలేజీ గ్రౌండ్స్ లో జరుగనున్న 68 వ స్కూల్ గేమ్స్ అండర్19 బాలికల జాతీయ వాలీ బాల్ పోటీలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.పోటీల నిర్వహణ నిమిత్తం గత రెండు రోజుల నుంచి వాలీ బాల్ కోర్టుల నిర్మాణం వేగం గా జరుగుతున్నాయి.జాతీయ పోటీల స్థాయి తగ్గట్టు క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేస్తున్నారు.పోటీల్లో పాల్గొనే వివిధ రాష్ట్రా ల జట్లు శుక్రవారం రాత్రి నుంచే నగరానికి చేరుకొనున్నాయి.క్రీడాకారులు …

Read More »

జిల్లాలో నేడు నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు వచ్చిన అర్జీలు: 472

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ, మండల స్థాయిలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 6 నుండి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు సంబంధించి శుక్రవారం తిరుపతి జిల్లాలో నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సులో రెవెన్యూ, భూ సమస్యలను సులభతరంగా పరిష్కరించుకోవడానికి అనువైన వేదిక రెవెన్యూ సదస్సులు అని ఈ వేదికను మండల గ్రామ స్థాయిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రెవెన్యూ …

Read More »

విద్యార్దులు వారి విన్నూత్న ప్రయోగాల పట్ల ఆలోచన శక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది

-జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ శ్రీకాళహస్తి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్దులు వారి విన్నూత్న ప్రయోగాల పట్ల ఆలోచన శక్తిని పెంపొందించు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం శ్రీకాళహస్తిలోని ఆర్ పి బి ఎస్ జెడ్ పి హై స్కూల్ నందు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ లో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రోజు వారీ తరగతి …

Read More »

పోర్టులు, ఎయిర్ పోర్టులతో అభివృద్ధికి బాటలు

-7 కొత్త ఎయిర్ పోర్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష -గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణ, భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం పైనా రివ్యూ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కొత్తగా 7 ఎయిర్ పోర్టులు రానున్నాయి. వీటిపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను గ్రౌండ్ చేసే పనులు మొదలు పెట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 7 ఎయిర్ పోర్టులు ఉన్నాయి. విశాఖ, తిరుపతి, కడప, రాజమండ్రి, గన్నవరం ఎయిర్ పోర్టులను ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. …

Read More »

ట్రైబ‌ల్ విజ‌న్ -2025 క్యాలెండ‌ర్ ఆవిష్క‌రించిన ఎంపి కేశినేని శివ‌నాథ్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ట్రైబ‌ల్ విజ‌న్ -2025 క్యాలెండ‌ర్ ను విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) శుక్ర‌వారం గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో ఆవిష్క‌రించారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు గిరిజ‌న సంక్షేమం, అభివృద్ది ద్యేయంగా ప‌నిచేస్తున్నాయ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎస్సీ సెల్ ఎన్టీఆర్ జిల్లా అధ్య‌క్షుడు సొంగాసంజ‌య్ వ‌ర్మ‌, టిడిపి రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం, టిడిపి నాయ‌కులు దాములూరి మ‌ధుసూధ‌న రావు , బి.న‌రేష్ ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Read More »

సీఎం చంద్ర‌బాబు సంక‌ల్పానికి ఆ భ‌గ‌వంతుడి ఆశీస్సులు వున్నాయి : ఎంపి కేశినేని శివ‌నాథ్

-సీఎం కి స్వాగతం ప‌లికిన ఎంపి కేశినేని శివ‌నాథ్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గం పటమట లోని శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో దత్త క్షేత్ర నాద యాత్ర – 2025, పరివార నివాస సముదాయ భవన ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి , ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ , కలెక్టర్ లక్ష్మిశ, వి.ఎం.సి క‌మీష‌నర్ ధ్యాన‌చంద్ర తో కలిసి విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ స్వాగ‌తం …

Read More »

ప్ర‌జలంద‌రూ ఆరోగ్యంగా వుంటేనే స‌మాజాభివృద్ది సాధ్యం : ఎంపి కేశినేని శివ‌నాథ్

-ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ఆధ్వ‌ర్యంలో ఉచిత‌ మెగా మెడిక‌ల్ క్యాంప్ -ఫ్రీ మెగా మెడిక‌ల్ క్యాంప్ పోస్ట‌ర్ ఆవిష్క‌రించిన ఎంపి -ఈ నెల 5వ తేదీన కె.బి.ఎన్. కాలేజీ లో ఫ్రీ మెడిక‌ల్ క్యాంప్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 5వ తేదీన ఆదివారం విజ‌య‌వాడ ప‌శ్చి మ‌నియోజ‌క‌వ‌ర్గంలో కె.బి.ఎన్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా మెడిక‌ల్ క్యాంప్ ను ప్ర‌జ‌లంద‌రూ సద్వినియోగం చేసుకోవాలని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ …

Read More »

జూన్ లోపు నూత‌న టెర్మినల్ భ‌వ‌న నిర్మాణ ప‌నులు పూర్తి కావాలి

-కేంద్ర పౌర‌విమానాయ‌న శాఖ మంత్రి కింజ‌రాపు , ఎంపి కేశినేని ప‌నులు పరిశీల‌న‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ విమానాశ్ర‌యంలో నిర్మిస్తున్న నూత‌న టెర్మిన‌ల్ భ‌వ‌న నిర్మాణ ప‌నుల‌ను కేంద్ర పౌర‌విమానాయ‌శ శాఖ మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు, ఎంపి కేశినేని శివ‌నాథ్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శుక్ర‌వారం ప‌రిశీలించారు. ఎయిర్ పోర్ట్ అధికారులు కొత్త టెర్మినల్ భవన నిర్మాణ పనుల పురోగతి గురించి వివ‌రించారు. అలాగే కొత్త టెర్మినల్ భ‌వ‌నం పై వ‌ర‌కు వెళ్లి అన్ని నిర్మాణ ప‌నులు …

Read More »

నగదు రహిత చికిత్సల్లో హైబ్రిడ్ విధానం – 1.43 కోట్ల కుటుంబాలకు లబ్ధి

-ఏప్రిల్ 01 నుంచి బీమా విధానంలో ఆరోగ్య సేవలు -ప్రతి కుటుంబానికి రూ.2500 వరకు ప్రీమియంను ప్రభుత్వం చెల్లిస్తుంది -ఆరోగ్యశ్రీ ఉంది, ఎన్టీఆర్‌ వైద్య సేవ పేరుతో మరింత మైరుగైన వైద్యం -ఆసుపత్రులకు బిల్లులు, పేదలకు వైద్య సేవలు ఆగవు -గత ప్రభుత్వ హయాంలో ఆసుపత్రుల్లో చాలా అక్రమాలు -మీడియా సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ ఎక్కడికీ పోలేదని, ఎన్టీఆర్‌ వైద్య సేవ పేరుతో మరింత మైరుగైన వైద్య సేవలు …

Read More »

పారిశుధ్య పనులపై సమీక్షా సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో త్వరలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, పారిశుధ్య పనులను పిన్ పాయింట్ గా పర్యవేక్షణ చేస్తామని, వార్డ్ సచివాలయాల వారీగా శానిటేషన్ కార్యదర్శులు పారిశుధ్య పనుల పట్ల భాధ్యతవహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు, సెక్రెటరిలతో ట్రేడ్ లైసెన్స్ లు, పారిశుధ్య పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూనగరంలో ఇంటింటి చెత్త సేకరణ …

Read More »