విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్) సెంట్రల్ జోన్ ఉమెన్స్ వింగ్ ఆధ్వర్యంలో 27 ఏప్రిల్ 2026న గుంటూరులో ‘పుట్టగొడుగుల పెంపకంపై ఒకరోజు వర్క్షాప్’ విజయవంతంగా జరిగింది. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా, మహిళలు మరియు యువతకు ఆదాయ అవకాశాలను మెరుగుపరిచే ఆచరణాత్మక నైపుణ్యాలను అందించడం ద్వారా వారిని సాధికారులను చేసేందుకు ఏపీ ఛాంబర్స్ ఇలాంటి వర్క్షాప్లను నిర్వహిస్తోంది. గత ఏడాది కాలంగా, రాష్ట్రవ్యాప్తంగా ఛాంబర్స్ విజయవంతంగా అనేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహించింది. …
Read More »Monthly Archives: April 2026
ఆర్ జేటీసీ వడ్డే సుందర్ను కలిసిన ఉద్యోగ సంఘ నాయకులు
-ఖాళీల భర్తీలు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేసిన జోనల్ అధ్యక్షుడు యం. రాజుబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు సత్వర సేవలు అందించడంతో పాటు శాఖ లక్ష్యాలను అధిగమించే విధంగా కృషి చేయాలని రీజినల్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వడ్డే సుందర్ పేర్కొన్నారు. స్థానిక బందరు రోడ్డులోని రీజినల్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కార్యాలయంలో సోమవారంనాడు రీజినల్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వడ్డే సుందర్ను రవాణాశాఖ నాన్-టెక్నికల్ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు ఎం. …
Read More »రేపటిలోగా డీజిల్, పెట్రోల్ సప్లయ్ పెరగాలి
-ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోండి -వరి కోత యంత్రాలకు డీజిల్ కొరత రానివ్వొద్దు -ఆయిల్ కంపెనీలు ఉన్నపళంగా పాలసీలు మార్చి ఇబ్బంది పెడితే ఎలా? -అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు సమస్య చక్కదిద్దేందుకు టాస్క్ ఫోర్స్, కంట్రోల్ రూమ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పెట్రోల్, డీజిల్ విక్రయాల్లో డిమాండ్కి తగిన సప్లయ్ ఉండేలా చూడాలని, సోమవారంలోగా రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను, ఆయిల్ కంపెనీల ప్రతినిధులను ఆదేశించారు. …
Read More »పెట్రోల్, డీజిల్ కొరతతో బంకుల మూసివేతపై ముఖ్యమంత్రి సమీక్ష
-ప్యానిక్ కొనుగోళ్లతో ఒక్కసారిగా పెరిగిన డిమాండ్ -రాష్ట్రంలోని 4,510 బంకుల్లో 421 బంకులు సరఫరా లేక మూతపడినట్లు తెలిపిన అధికారులు -ప్రజలు ఇబ్బందులు పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరా కొరతతో బంకుల మూసివేతపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. ముంబై నుంచి ఉదయం అమరావతికి బయలుదేరే ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్తో పాటు ఉన్నతాధికారులతో సీఎం టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాల వారీగా ప్రస్తుత …
Read More »అంతర్జాతీయ టెక్ మ్యాప్ లో విశాఖకు చోటు
-గూగుల్ ఏఐ డేటా సెంటర్ కు విశాఖ జిల్లాలో శంకుస్థాపన -15 బిలియన్ డాలర్ల పెట్టుబడి – 1 గిగా వాట్ సామర్థ్యంతో ఏర్పాటు -ఈ నెల 28న తర్లువాడలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన -గూగుల్ రాకతో విశాఖకు విశ్వఖ్యాతి – టెక్ కంపెనీల ఆసక్తి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో ఏపీలో సరికొత్త టెక్ అధ్యాయం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 28 తేదీన …
Read More »శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు కు ఆహ్వానం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నెల్లూరు జిల్లాలోని పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ , ఆలయ పాలకమండలి ఛైర్మన్ తిరుపాల్ రెడ్డి ఆహ్వానించారు. ఈనెల 27 నుంచి మే 3వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలకు సీఎంను ఆహ్వానించారు. ఈ మేరకు సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. ఆలయ అర్చకులు సీఎంకు ఆశీర్వచనం అందించి స్వామి వారి ప్రసాదాలను, చిత్రపటాన్ని అందించారు. …
Read More »ఏలూరు జిల్లాలో డీజిల్ కొరత లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి
-డీజిల్ కొరత ఉందన్న అవాస్తవాలు వ్యాప్తితో ప్రజలు భయాందోళనకు గురికాకుండా చర్యలు తీసుకోవాలి -ధాన్యం సేకరణ లారీలకు, ఆక్వా చెరువులకు అవసరాలకు సరిపడా డీజిల్ అందించాలి -డీజిల్ కొరతపై అత్యవసరంగా జిల్లా కలెక్టర్, జేసీ, ఎమ్మెల్యేలు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారథి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఏలూరు జిల్లాలో డీజిల్ కొరత లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల …
Read More »వడగాల్పులు వీచే అవకాశం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సోమవారం (27-04-26) 23 మండలాల్లో తీవ్ర, 26 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. వడగాలులు, ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రేపు వడగాల్పులు వీచే మండలాలు(23) విజయనగరం జిల్లా: బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, మెంటాడ, రామభద్రాపురం, తెర్లాం, వంగర మండలాలు; పార్వతీపురంమన్యం జిల్లా: బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, …
Read More »33/11 కేవీ సెమీ ఇండోర్ విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అత్యంత అధునాతనమైన పరిజ్ఞానంతో లోవోల్టేజ్ సమస్య అధిగమించి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆదివారం ఉదయం నగరంలోని 14 వ డివిజన్ బచ్చుపేట ప్రాంతంలో 6.30 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ సెమీ ఇండోర్ విద్యుత్ ఉప కేంద్రానికి మంత్రి, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణలతో కలిసి …
Read More »బీసీలకు అండా దండా తెలుగుదేశం పార్టీనే
-బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది -దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం శెట్టిబలిజల హర్షం -విజయవాడ జ్యోతి కన్వెన్షన్లో శెట్టిబలిజ కార్పొరేషన్ ఛైర్మన్ ఆధ్వర్యంలో అభినందన సభలో మంత్రి కొల్లు రవీంద్ర అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బీసీల అభివృద్ధి, అభ్యున్నతికి పునాదులు వేసింది తెలుగుదేశం పార్టీయేనని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శెట్టిబలిజ సంఘ వ్యవస్థాపకులు, ప్రముఖ సామాజిక కార్యకర్త దొమ్మేటి వెంకట రెడ్డి జయంతిని (మార్చి 23)ను …
Read More »
Prajavartha Online Telugu News