Breaking News

దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కృషి చేస్తాం… : ఎమ్మెల్యే ఆర్కే

దుగ్గిరాల, నేటి పత్రిక ప్రజావార్త :
దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్ నందు ఎమ్మెల్యే ఆర్కే గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే  మాట్లాడుతూ దుగ్గిరాల మార్కెట్ యార్డ్ నుండి రెవిన్యూ వెళుతున్నా సరే నిధుల కొరత ఉందని అధికారుల ద్వారా తెలుసుకున్నారు. నిధుల కొరత వలన యార్డ్ నందు అవసరమైన అబివృద్ది పనులకు ఆటంకం కలుగుతుందని అన్నారు. ఈ విషయాన్ని తక్షణమే పై అధికారుల దృష్టికి, మంత్రి కన్న బాబు దృష్టికి, ముఖ్యమంత్రి   జగన్మోహన రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని అన్నారు. ప్రపంచంలో పేరుగల దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్ లో లక్షల క్విన్టాళ్ల పసుపు వస్తుందని, ఇందుకు కోల్డ్ స్టోరేజ్ లు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని కొందరు రైతులు ప్రైవేట్ కోల్డ్ స్టోరేజ్ లలో పెట్టడం వలన అధిక వ్యయం అవుతుందని అన్నారు. దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్ అబివృద్ధికి ఎంతగానో కృషి చేసిన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును దుగ్గిరాల మార్కెట్ కి పెట్టడానికి ఏక పక్షంగా తీర్మానం చేయడం జరిగిందని అన్నారు. రానున్న కాలంలో డాక్టర్ వైస్సార్ పసుపు మార్కెట్ యార్డ్ గా మరనున్నదని అన్నారు. ఇందులో భాగంగా పసుపు యార్డ్ మహిళా హమాలీలకు 110 మందికి యూనిఫామలు ఎమ్మెల్యే ఆర్కే  చేతుల మీదుగా అందించడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *