వ్యవసాయ పరికరాలను రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా కృషి చేస్తాం… :  ఎమ్మెల్యే ఆర్కే

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళగిరి మార్కెట్ యార్డ్ నందు ఎమ్మెల్యే ఆర్కే గురువారం సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే  మాట్లాడుతూ యార్డ్ నందు సుమారు 8 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయని అధికారుల లెక్కల ద్వారా తెలుసుకోవడం జరిగిందని, త్వరలో ఉన్నతాధికారులను కలిసి ఈ నిధులను మార్కెట్ యార్డ్ పరిధిలో ఉన్న గ్రామాల రైతులందరికీ ఉపయోగించే విధంగా టార్పాలిన్ పట్టాలను, తైవాన్ స్ప్రేయర్లను అద్దెకు ఇచ్చే విధంగా, వ్యవసాయ పరికరాలను రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవడానికి కృషి చేస్తామని అన్నారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి  ఆర్బికెల ద్వారా రైతుల అబివృద్ధికి ఎంతో కృషి చేశారని, మార్కెట్ యార్డ్ ద్వారా మరింత మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణలో రైతు బాంధవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అందరం కలిసి తీర్మానం చేయటం జరిగిందని అన్నారు. సెప్టెంబర్ 2వ తేదీన రాజశేఖర్ రెడ్డి  వర్దంతి సందర్భంగా ప్రారంభోత్సవం చేయాలని నిర్ణయించామని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

4వేల ఎక‌రాల ల్యాండ్ బ్యాంక్ ఉంది

-పామాయిల్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్స‌హిస్తున్నాం -త‌ల‌స‌రి ఆదాయం రూ.4ల‌క్ష‌ల‌కుపైగా సాధాన ల‌క్ష్యం -ఏలూరు జిల్లా క‌లెక్ట‌ర్ వెట్రిసెల్వి అమ‌రావ‌తి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *