అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
‘భారతీయ హిందూ పరిషత్’ గుంటూరు జిల్లా కార్యవర్గ సభ్యులుగా కూరపాటి ప్రవీణ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కూరపాటి ప్రవీణ్ మాట్లాడుతూ ‘భారతీయ హిందూ పరిషత్’ గుంటూరు జిల్లా కార్యవర్గ సభ్యులుగా తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు వ్యవస్థాపకులకు, జాతీయ, రాష్ట్ర అధ్యక్షులకు, అధినాయకులకు, గుంటూరు జిల్లా అధ్యక్షులు అయినంపూడి శ్రీకాంత్, ‘మాతృశక్తి’ గుంటూరు జిల్లా అధ్యక్షురాలు మానేపల్లి రాజేశ్వరిలకి ధన్యవాదాలు తెలిపారు. ‘భారతీయ హిందూ పరిషత్’ గుంటూరు జిల్లా అధ్యక్షులు అయినంపూడి శ్రీకాంత్, ‘మాతృశక్తి’ గుంటూరు జిల్లా అధ్యక్షురాలు మానేపల్లి రాజేశ్వరిలు శుభాకాంక్షలు తెలిపారు. కులాలకు అతీతంగా హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించి, గోమాతని, మన సంస్కృతి, సాంప్రదా యాలను కాపాడటానికి కృషి చేయాలని కోరారు.
Prajavartha Online Telugu News