-హైదరాబాద్ లోని నివాసానికి చేరుకోనున్న ఉప ముఖ్యమంత్రివర్యులు
-వైద్యుల సూచన మేరకు మూడు వారాల తరువాత నుంచి ఫిజియోథెరపీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యణ్ కొద్దిసేపటి క్రితం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శస్త్ర చికిత్స నుంచి కోలుకుంటున్న ఆయన డిశ్చార్జ్ అనంతరం నేరుగా హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకుంటారు. మూడు వారాల తరువాత నుంచి ఫిజియోథెరపీ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఆపరేషన్ చేసిన భుజం సాధారణ స్థితికి చేరుకోవడానికి నాలుగు నెలల సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు.
Prajavartha Online Telugu News