హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి శనివారం సాయంత్రం వెళ్లిన లోకేష్ విజయవాడ కనకదుర్గమ్మ చిత్రపటం, ప్రసాదం అందించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భుజానికి అయిన గాయం, శస్త్ర చికిత్స గురించి తెలుసుకున్నారు. వైద్యుల సూచనలు పాటించాలని కోరారు.
Prajavartha Online Telugu News