విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వంగవీటి రంగా గారి 33వ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ పలుచోట్ల జరిగిన వర్దంతి కార్యక్రమంలో పాల్గొని అనేక సేవకార్యక్రమలు నిర్వహించారు ఈ సందర్భంగా మొదట వంగవీటి రంగా గారి తనయుడు వంగవీటి రాధ తో కలిసి బందర్ రోడ్ లోగల వంగవీటి మోహన రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన రంగా విద్యార్థి దశ నుంచే సామాజిక స్పృహ కలిగిన ప్రజా సమస్యలపై పోరాటం చేసే లాగా విద్యార్థి నాయకత్వాన్ని తయారుచేసిన గొప్ప వ్యక్తిఅని, పేద వారికి సొంత ఇంటి కల సాకారం కోసం మూడు దశాబ్దాల కింద నిరంతరం పోరాటం చేసి, ఇళ్ల పట్టాల కు నామమాత్రం ధరకే రిజిస్ట్రేషన్ చేయాలని పోరాటం చేసిన యోధుడని , అటువంటి వ్యక్తికి నిజమైన నివాళి అర్పించడం అంటే వారి ఆశయాలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రజల కోసం పోరాటం చేసి, వారికి అండగా నిలబలన్నారు. వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా చిన్న జిల్లాలో ఏర్పాట్లు లో ఏదో ఒక జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరును నామకరణం చేయాలని డిమాండ్ చేసారు, ఆ పేరు కూడా కృష్ణా జిల్లాలో ఒక జిల్లాకు పేరు పెడితే వంగవీటి మోహన రంగా పేరుకు సార్థకం చేసినట్లవుతుందని, ఈ విషయంలో వల్లభనేని వంశీ చొరవ తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ అందుకు భిన్నంగా వ్యవహరించినట్లయితే రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రభుత్వంపై ఉద్యమిస్తామని పోతిన మహేష్ హెచ్చరించారు అనంతరం 44 డివిజన్ లో చెరువు సెంటర్ వద్ద సురేష్ విజయ లక్ష్మీ ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగా 33 వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ రంగ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు మైలవరపు కొండలరావు, స్టాలిన్, నగర ఉపాధ్యక్షులు వెన్న శివశంకర్, గంజి పవన్, షేక్. ఐజాక్, బావి శెట్టి శ్రీను, మూర్తి , పుల్లారావు, తదితరులు పాల్గొన్నారు 48 డివిజన్ లో సొరంగం సెంటర్ వద్ద వేవిన. నాగరాజు మరియు నరేష్ గార్ల ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగా 33 వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ రంగ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు,చిట్టినగర్ సెంటర్ వద్ద నారంశెట్టి కూర్మా రావు గారి ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగా 33 వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ రంగ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు , అనంతరం బంగారయ్య కొట్టు సెంటర్ వద్ద అ తమ్మిన రఘు ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగా గారి 33 వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ రంగ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యులు కొర్ర గంజి వెంకటరమణ ,జగదీష్, వెంకటేష్, పోతిన అదిత్, నాగోతి సాయి తదితరులు పాల్గొన్నారు. 50 వ డివిజన్ లో మహంతిపురం సాయిబాబా గుడి సెంటర్ వద్ద రెడ్డిపల్లి. గంగా మరియు చోక్కర. నగేష్ గార్ల ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగా 33 వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ రంగ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం పేదలకు పండ్లు, పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రామిశెట్టి మురళి, సాబ్కార్ నరేష్, నూనె సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 51 వ డివిజన్ లో నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద గురువు మదన్ మరియు రాజు గార్ల ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగా 33 వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ రంగ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం నిత్యావసర సరుకులు, దుప్పట్లు, కమలాకాయలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అమ్మవారి ధార్మిక మండలి సభ్యులు రాళ్ళ పూడి గోవింద్, నెల్లి బిల్లీ కనకారావు, ఆలమూరి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు 52 వ డివిజన్ లో బ్రాహ్మణ వీధిలో పోలిశెట్టి శివ గారి ఆధ్వర్యంలోవంగవీటి మోహన రంగా 33 వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ రంగ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం పేదలకు అన్నదానం పండ్లు పంపిణీ చేశారు 62 వ డివిజన్ లో సోడిశెట్టి. రాధా ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగా వ 33 వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ రంగ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు వంగవీటి రంగా 33వ వర్ధంతి మధుర నగర్ లోని 29వ డివిజన్లో కెన్బూరి కృష్ణ ఆధ్వర్యంలో నివాళులర్పించే కార్యక్రమంలో జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు ముఖ్య నాయకులు మైలవరపు కొండలరావు, స్టాలిన్, నగర ఉపాధ్యక్షులు వెన్న శివశంకర్, గంజి పవన్, షేక్. ఐజాక్, బావి శెట్టి శ్రీను, మూర్తి , పుల్లారావు, తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News