Breaking News

రాష్ట్ర ఉర్థూ అకాడమీ బోర్డు సభ్యుల నియామకం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్థూ అకాడమీ బోర్డు సభ్యులుగా ఐదుగురిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసింది. ఇందుకు సంబందించిన జి.ఓ.ఆర్టి నెం.205 ను డిశంబరు 22 ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి గంథం చంద్రుడు జారీచేశారు. గుంటూరుకు చెందిన షేక్ అబిదా బేగం, కర్నూలుకు చెందిన సయ్యద్ నూరుల్లా క్వాద్రీ, కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన షేక్ అబ్దుల్ షుకూర్, ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన షేక్ మట్లపూడి బాజీ వలీ మరియు విశాఖపట్నానికి చెందిన తయ్యా బౌనిస్సా ను రాష్ట్ర ఉర్థూ అకాడమీ బోర్డు సభ్యులుగా నియమిస్తూ ఈ ఉత్తర్వులను జారీచేశారు. ఈ ఉత్తర్వులను జారీచేసిన నాటి నుండి రెండేళ్ల పాటు రాష్ట్ర ఉర్థూ అకాడమీ బోర్డు సభ్యులుగా వీరు కొనసాగుతారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *