హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
నూతనంగా ఏర్పడిన జైభీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ ఏప్రిల్ మంగళవారం లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ ని హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసి రాబోయే కాలంలో ప్రజా సమస్యలపై తాము చేసే పోరాటానికి మద్దతు తెలపాల్సిందిగా కొరకటం జరిగింది ఈ మీదట తన సహకారం ఎప్పుడూ ఉంటుందని. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులకు కారణం కావాలని జైభీమ్ భారత్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపిన జయప్రకాష్ నారాయణ జైభీమ్ భారత్ పార్టీ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలిపిన జడ శ్రావణ్ కుమార్ రానున్న కాలంలో లో ప్రతి ప్రజా సమస్య పై జైభీమ్ భారత్ పార్టీ పోరాటం చేస్తుందని ఆ పోరాటానికి జేపీ సహకారం కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెవుల కృష్ణ ఆంజనేయులు ఏపీ జర్నలిస్టు ఫోరం అధ్యక్షులు మరియు జైభీమ్ భారత్ పార్టీ 26 జిల్లాల ప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News