అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
డా.బి. ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ కమిషన్ కార్యాలయంలో మైనార్టీస్ చైర్మన్ డాక్టర్ కె ఇక్బాల్ అహ్మద్ ఖాన్ అంబేద్కర్ ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం తోనే దేశానికి దిశా దశ నిర్దేశం జరిగిందని, ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగంగా గుర్తింపు పొందిందని అన్నారు. అనంతరం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వైస్ చైర్మన్, కమిషన్ మెంబర్స్ ను, సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ కమిషన్ వైస్ చైర్మన్ డాక్టర్ జాషువా డానియల్ మరియు కమిషన్ మెంబర్స్ జితేందర్ జిత్ సింగ్, షేక్.సైఫుళ్ల, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News