Breaking News

APPJA రాష్ట్ర కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) అనుబంధ ఆంధ్ర ప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ (APPJA) రాష్ట్ర నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికయింది. అసోసియేషన్ గౌరవాధ్యక్షులుగా జీవి నారాయణ (విజయవాడ), అధ్యక్షులుగా సిహెచ్ విఎస్ విజయ భాస్కరరావు( విజయవాడ), ప్రధాన కార్యదర్శిగా వీ.రూబెన్ బెసాలియల్ (విజయవాడ), కోశాధికారిగా జి మహేష్ (విజయవాడ) ఎన్నిక కాగా ఉపాధ్యక్షులుగా ఎన్. సాంబశివరావు (విజయవాడ), వి. పెద్దిరాజు ( వైజాగ్), షేక్ రియాజుద్దీన్ (ఏలూరు), జి గిరిబాబు (తిరుపతి) ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శులుగా సిహెచ్ వి మస్తాన్ (విజయవాడ), కె విక్టర్ డేనియల్ (అనంతపూర్), దూదేకుల హుస్సేన్ (కర్నూల్), వి వి ఆర్ ఉమామహేశ్వరరావు (గుంటూరు)తో పాటు ఏ జయశంకర్ (శ్రీకాకుళం), బి.జోగారావు (విజయనగరం), వై. రామకృష్ణ (విశాఖపట్నం), జి.ప్రసాద్ (రాజమండ్రి), ఎస్ .ఎస్ .విజయ్ బాబు (విజయవాడ), ఎం. ప్రసాద్ (ఒంగోలు), ఎన్ మాల్యాద్రి (నెల్లూరు), కే.మాధవ్ (తిరుపతి), రమేష్ (కడప), ఏ. శ్రీనివాసమూర్తి (విజయవాడ), సిహెచ్. వెంకట్ (విజయవాడ), ఏ. శరత్ కుమార్ (వైజాగ్)ను
రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో గురువారం నూతన కమిటీని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ వి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్ ప్రకటించి కొత్త కమిటీకి అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో యూనియన్ తో కలిసి సంఘటితంగా జర్నలిస్టుల హక్కుల సాధన, సంక్షేమం కోసం నిర్వహించే కార్యక్రమాల్లో ఫోటో జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొంటారని ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఐజెయు కౌన్సిల్ సభ్యులు షేక్ బాబు, ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ కార్యదర్శి కొండ రాజేశ్వరరావు ప్రెస్ క్లబ్ కార్యదర్శి వసంత్, అర్బన్ యూనిట్ ప్రెస్ క్లబ్ నాయకులు కొండ రాజేశ్వరరావు వసంత్ , దారం వెంకటేశ్వరరావు, రామారావు ,సురేంద్ర సీనియర్ యూనియన్ నేతలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *