-ప్రత్యేక ఆకర్షణ గా బొమ్మలకొలువు -పౌర్ణమి సందర్బంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమం -పాల్గొన్న ఆలయ ఈవో కే రామచంద్ర మోహన్ మరియు డిప్యూటీ ఈవో ఎం. రత్నరాజు -పూర్ణాహుతి తో ముగిసిన శివకామసుందరీ సమేత నటరాజ స్వామి వారి కల్యాణ మహోత్సవం ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : తేదీ. 13-01-2025 నుండి తేదీ. 15-01-2025 వరకు సంక్రాంతి వేడుకలు సందర్బంగా సోమవారం ‘భోగి’ రోజున ఉదయాన్నే చిన్న రాజ గోపురం వద్ద ఉన్న ప్రాంగణం నందు భోగి మంటలు కార్యక్రమం శాస్త్రోక్తముగా నిర్వహించడం …
Read More »Tag Archives: indrakiladri
ఇంద్రకీలాద్రి పై భోగి పండ్లు కార్యక్రమం
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : భోగి సందర్బంగా సోమవారం దేవస్థానం మహమండపం 7 వ అంతస్తు నందు పెద్ద రాజగోపురం ఎదురుగా ఉన్న ప్రాంగణం నందు బొమ్మల కొలువు దగ్గరలో విద్యార్థినులచే సంధ్య గొబ్బెమ్మలు ఏర్పాటు చేసి, పూజలు నిర్వర్తించి, గొబ్బి పాటలు పాడి, నృత్యం చేసి, చిన్నారులకు మరియు విధ్యార్థినులకు భోగి పండ్లు పోయు కార్యక్రమం శాస్త్రోక్తముగా నిర్వహించడం జరిగినది. అనంతరం వీరికి ప్రసాదం అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ, ఆలయ సిబ్బంది, అర్చక …
Read More »శ్రీ కనకదుర్గా అమ్మవారికి 2 లక్షలు విరాళం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైట్ ఫీల్డ్, బెంగుళూరు కు చెందిన దాత వెలుగురి కుమార్ శ్రీ అమ్మవారి దేవస్థానం నందు కానుకగా ఈ -హుండీ నిమిత్తం రూ.2,00,000/-లును ఆలయ ఈవో కె ఎస్ రామరావు ని కలిసి విరాళముగా చెక్కు రూపములో అందజేశారు. ఈ సందర్బంగా ఆలయ అధికారులు దాత కుటుంబం నకు అమ్మవారి దర్శనం కల్పించి, వేదపండితులుచే వీరికి వేదార్వచనం చేయించగా ఆలయ ఈవో అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం మరియు చిత్రపటం అందజేశారు.
Read More »అమ్మవారిని దర్శించుకున్న ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ మధుకర్ భగవత్ శనివారం ఆలయమునకు విచ్చేయగా వీరికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సత్యనారాయణ, ఐఏఎస్ మరియు ఆలయ ఈవో కె ఎస్ రామరావు, డిప్యూటీ ఈవో ఎం రత్న రాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. ఈ సందర్బంగా వీరు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వీరికి వేదంపండితుల ఆలయ వేదపండితులచే …
Read More »కృష్ణవేణి సంగీత నీరాజనం 3వ రోజు – భక్తి సంగీతం మరియు సంప్రదాయ వారసత్వానికి మహోత్సవం
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణవేణి సంగీత నీరాజనం 3వ రోజు వేడుకలు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భక్తి భావంతో ప్రారంభమయ్యాయి. స్థానిక కళాకారులు మరియు గాయకులు దేవీ కృతులు ఆలపించి, భక్తి మరియు సంగీతం కలిసి మేళవించిన అద్భుత ప్రదర్శన అందించారు. కళాకారులను శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామీ వారల దేవస్థాన అధికారులు మరియు ప్రధాన అర్చకులు సన్మానించి, ఈ మహా సంగీత ఉత్సవానికి అందించిన వారి విశేష సేవలను గుర్తించారు. ఈ మహోత్సవం నేడు సాయంత్రం …
Read More »శాస్త్రోక్తముగా “ధనలక్ష్మి” పూజ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దీపావళి సందర్బంగా ఈరోజు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ప్రధానాలయం నందు శ్రీ అమ్మవారికి ఆలయ వైదిక సిబ్బంది “ధనలక్ష్మి” పూజ శాస్త్రోక్తముగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమం నందు ఆలయ ఈవో కె ఎస్ రామరావు దంపతులు పాల్గొని శాస్త్రోక్తముగా పూజలు నిర్వహించారు. తదుపరి ప్రదోష కాలం నందు శ్రీ అమ్మవారికి సా. 06 గం. లకు ప్రతిరోజూ నిర్వహించు పంచహారతుల సేవ నిర్వహించిన అనంతరం దీపావళి సందర్బంగా ఆలయ ప్రాంగణములు మొత్తం దీపములు ప్రజ్వలన …
Read More »ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఇంద్రకీలాద్రి పై దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం లో చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలను పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) పరిశీలించారు. ఆలయ ఈవో కేఎస్ రామారావు , ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఈవో కార్యాలయంలో ఎమ్మెల్యే సుజనా మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రూపొందించిన దుర్గగుడి మాస్టర్ ప్లాన్ ను పరిశీలించామని ఆలయ అభివృద్ధికి అవసరమయ్యే సలహాలను, సూచనలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. అధికారుల, ప్రజాప్రతినిధుల …
Read More »అమ్మ వారి కి 10 లక్షల బంగారు హారం బహుకరించిన పంకజ్ రెడ్డి
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : నెల్లూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త పంకజ్ రెడ్డి, సరిత దంపతులు పది లక్షల రూపాయలు విలువైన బంగారు హారం అమ్మవారికి బహుకరించారు. వస్తు విలువను నిర్ధారించే… ధ్రువీకరణ పత్రం, హారం శనివారం ఆలయ కార్య నిర్వహణ అధికారి కె.ఎస్ రామారావుకు అందజేశారు. అనంతరం దాతలకి వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ పిఆర్ఓ డి వి వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Read More »శ్రీ రాజరాజేశ్వరీ దేవి అవతార విశిష్టత…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఆశ్వయుజ శుద్ధ దశమి రోజున అమ్మవారు రాజరాజేశ్వరీ దేవిరూపంలో దర్శనమిస్తారు. శరన్నవరాత్రులలో ఆశ్వయుజ శుద్ధ దశమి(విజయ దశమి) రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవిరూపంలో దర్శనమిస్తుంది. నవరాత్రులలో ఈరోజే ఆఖరిరోజు. ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉన్న కనకదుర్గ ఆలయంలో అమ్మవారు ఈ రూపంలో దర్శనమిస్తారు. ఈరోజును విజయదశమిగా అమ్మవారు చిద్రూపిణి. వరదేవతగా అలరారుతుంది. పరమేశ్వరుని అంకమును ఆసనముగా చేసుకుని, చేతిలో చెరకుగడతో, చిరుమందహాసంతో శోభాయమానమై ప్రకాశించే జగన్మాతను భక్తితో పూజించుకోవాలి. అనంత శక్తి స్వరూపిణి అయిన ఈ తల్లి …
Read More »శరన్నవరాత్రుల ముగింపు పూర్ణాహుతి కార్యక్రమం
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : దసరా ఉత్సవాల సందర్భంగా శనివారం విజయ దశమి రోజున శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకృత అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో, భవానీ మాలధారులతో ఇంద్రకీలాద్రి జనసంద్రమైంది. జై భవాని, జై జై భవాని.. జై దుర్గా, జై జై దుర్గా జయజయధ్వానాలతో హోరెత్తింది. ఆధ్యాత్మిక పరిమళాలతో సుగంధ భరితమైంది. శరన్నవరాత్రుల కార్యక్రమాల ముగింపు రోజు శాస్త్రోక్తంగా నిర్వహించే పూర్ణాహుతి కార్యక్రమం వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. విజయదశమి కావడంతో సాధారణ భక్తులతో పాటు …
Read More »
Prajavartha Online Telugu News