Breaking News

Tag Archives: indrakiladri

శ్రీ మహిషాసుర మర్దిని దుష్ట శక్తులపై విజయం సాధించిన దేవత

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సీతారాంపురం ఇజ్జాడ వారి వీధి నందు శుక్రవారం దసరా నవరాత్రులలో భాగంగా నేడు శ్రీ శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి పంచలోహ తురన ప్రభ మహోత్సవ కమిటీ వారు ఏర్పాటుచేసిన  “శ్రీ మహిషాసుర మర్దిని” గా దర్శనమిచ్చిన అమ్మవారిని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, ప్రముఖ న్యాయవాది బొండా సిద్దార్థ దర్శించుకుని ఆ అమ్మవారి చల్లని దీవెనలు ప్రజలందరిపై సెంట్రల్ నియోకవర్గం పై ఉండాలని కోరుకుంటూ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం …

Read More »

మహిషాసుర మర్ది దేవి అందరికీ శక్తి, ధైర్యం మరియు విజయాన్ని ప్రసాదించాలని కోరుకుందాం

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : దసరా నవరాత్రులలో భాగంగా శుక్రవారం “మహార్నవమి సందర్భంగా” ఇంద్రకీలాద్రిపై  నందు “శ్రీ మహిషాసుర మర్దిని” గా దర్శనమిచ్చిన అమ్మవారినీ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, ప్రముఖ న్యాయవాది బొండా రవితేజ  దర్శించుకుని ఆ అమ్మవారి చల్లని దీవెనలు ప్రజలందరిపై సెంట్రల్ నియోకవర్గం పై ఉండాలని కోరుకుంటూ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బొండా సిద్ధార్థ మాట్లాడుతూ ఈరోజు 9వ రోజు దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా శ్రీ మహిషాసుర మర్దిని దేవి అమ్మవారి అలంకరణ ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు …

Read More »

తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పట్టు వస్త్రాల సమర్పణ…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఏడుకొండల పై కొలువై ఉన్న దేవ దేవుడు కలియుగ దైవం పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున శుక్రవారం కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. సహాయ కార్య నిర్వహణ అధికారి బి. దొరస్వామి ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు తోడుకొని వచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, సిబ్బందికి ఇంద్రకీలాద్రి కార్యనిర్వహణాధికారి కె.ఎస్. రామరావు, ఉప కార్యనిర్వహణాధికారి రత్నరాజు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస శాస్త్రి స్వాగతం పలికారు. వేద పండితులు మేళ …

Read More »

అర్చకసభలో వైభవంగా మంత్రార్చన

-అర్చకసభల సంప్రదాయం కొనసాగిస్తాం -ఆలయ ఈవో కెఎస్ రామరావు వెల్లడి ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ ఆలయాల అర్చకులు ఏకకంఠంతో జగన్మాత చెంత చేసిన పారాయణం భక్తి జ్ఞానంతో మారుమోగింది. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దసరా వేడుకల్లో భాగంగా శ్రీ మహిషాసుర మర్ధిని అవతారంలో కొలువైన అమ్మవారిని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. శుక్రవారం శ్రీ మల్లికార్జున స్వామి మహామండపం లోని ఆరవ అంతస్తు లో అర్చక సభ వైభవోపేతంగా జరిగింది. పంచప్రాణాల్లో మొదటిది అర్చకుడి ప్రాణం. నడిచే హరి …

Read More »

మహిషాసురమర్ధని అలంకృత జగజ్జననిని దర్శించుకున్న శాసనసభ్యులు హరిప్రసాద్

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : దుర్గా శరన్నవరాత్రులు తొమ్మిదవ రోజు శ్రీ మహిషాసుర మర్ధిని దేవి (మహర్నవమి) అలంకృత అమ్మవారిని శాసనమండలి సభ్యులు హరిప్రసాద్ దర్శించుకున్నారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. క్యూ లైన్లలో కూడా గందరగోళం తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ …

Read More »

మహిషాసుర మర్దని అలంకృత దుర్గమ్మను దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ దంపతులు

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు దుర్గమ్మ శ్రీ మహిషాసుర మర్దినిదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సతీసమేతంగా దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ ఈవో రామారావు నీరబ్ కుమార్ ప్రసాద్ దంపతులకు స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనం అనంతరం ఆశీర్వచన మండపంలో నీరబ్ కుమార్ ప్రసాద్ దంపతులకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేసారు. అనంతరం ఈఓ రామారావు అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రం, అమ్మవారి ప్రసాదం …

Read More »

మహిషాసురమర్ధని అలంకృత జగజ్జననిని దర్శించుకున్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజున జగన్మాత మహిషాసుర మర్దని రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ సతీసమేతంగా శుక్రవారం కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది, వేద పండితులు సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటం కృష్ణప్రసాద్ దంపతులకు అందించారు.

Read More »

శ్రీ మహిషాసుర మద్దినీ దేవి అలంకరణలో దుర్గమ్మ   

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : మహిషమస్తక నృత్త వినోదిని స్ఫుటరణన్మణి నూపుర మేఖలా జనరక్షణ మోక్ష విధాయిని జయతి శుంభ నిశుంభ నిషూధిని. క్రోది నామ సంవత్సర దేవీ నవరాత్రులలో తొమ్మిదో రోజున ఆశ్వయుజ శుద్ధనవమి తిథి ఉన్నప్పుడు మహర్నవమి రోజున కనకదుర్గ అమ్మ శ్రీ మహిషాసుర మద్దినీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఎనిమిది రోజుల యుద్ధం తరవాత అమ్మ నవమినాడు మహిషాసురుణ్ని మర్దించి, లోకాలన్నింటికి ఆనందాన్ని చేకూర్చింది. అమ్మ అవతారాన్నింటిలో దుష్టశిక్షణ చేసిన ఈ రూపం అత్యుగ్రం. అందరు …

Read More »

పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకొని తరిస్తున్నారు…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం రాత్రి ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్ వద్ద రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. శ్రీ దుర్గాదేవి అలంకృత అమ్మవారు గురువారం భక్తులకు దర్శనం ఇచ్చారని.. దుర్గాష్టమి రోజున ఇంద్రకీలాద్రిపై గొప్ప వైదిక సభ నిర్వహించడం జరిగిందని.. ఈ సభలో వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 400 మంది హాజరై వేద పఠనం జరిపారన్నారు. ఓ గొప్ప ఆనవాయితీని కొనసాగించడం.. వైదిక జ్ఞానాన్ని భావితరాలకు అందించే ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని …

Read More »

జగన్మాత చెంత చతుర్వేద పండిత సభ

-వేద పండితులకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘన సత్కారం ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రిపై కొలువైన వేద స్వరూపిణికి దుర్గాష్టమి రోజున వేద పండితులు మంత్రాభిషేకం వైభవంగా జరిగింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన వేద పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ నుంచి వేద పండితులు వచ్చారు. ఇంద్రకీలాద్రి ఆలయంలోని శ్రీ మల్లికార్జున మహా మండపం ఆరో అంతస్తులో గురువారం సాయంత్రం వేదసభ జరిగింది. నాలుగు వేదాలైన ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ …

Read More »