విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో కరాటేలో ప్రతిభ కనపరిచిన తంగా తేజశ్రీ సాయికి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ఆర్థిక సాయం అందించారు. ఊర్మిళ నగర్ లోని మమతా దేవి విద్యానికేతన్ కు చెందిన తేజశ్రీ సాయి ఈ నెల పంజాబ్ లుధియానాలో జరగనున్న జాతీయస్థాయి కరాటే పోటీలకు ఎంపికయ్యారు. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ 8వ తరగతి చదువుతున్న తంగా తేజశ్రీ సాయిను అభినందించారు. 13 ఏళ్ల వయసులోనే అండర్ -14 విభాగంలో జాతీయస్థాయిలో రాణించేలా ప్రోత్సహించిన తల్లితండ్రులను కొనియాడారు. చిన్నారి తేజశ్రీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. కూటమి నేతలు పత్తి నాగేశ్వరరావు, బొమ్ము గోవిందు, రవి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News