Breaking News

అండర్ ట్రయిల్ రివ్యూ కమిటీ మీటింగ్…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం తూర్పు గోదావరి 1 వ అధనపు జిల్లా న్యాయమూర్తి ఆర్.శివ కుమార్ జిల్లా కోర్టు ఆవరణలో అండర్ ట్రయిల్ రివ్యూ కమిటీ మీటింగ్ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ నిర్వహించారు.

ఈ సమావేశంలో విచారణలో ఉన్న ఖైదీల కేసుల దర్యాప్తు, చార్జ్ షీట్ ఫైల్ చేసే విషయంలో పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. బెయిలు/జామీనుల విషయంలో ఖైదీలు ఎదుర్కుంటున్న సమస్యలపై తీసుకోవాల్సిన చర్యలు గురించి చర్చించి, సంబంధిత అదికారులకు తగిన సిఫార్సులు చేశారు.

ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ న్యాయమూర్తి . కె. ప్రకాష్ బాబు గ, 1 వ అధనపు సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఎస్.కె. జానీ బాష , తూర్పు గోదావరి జిల్లా అడిషనల్ ఎస్.పి ఏ.వి. సుబ్బరాజు, కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్.పి ఎమ్.జె.వి.భాస్కర్ రావు , ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రెవెన్యూ అధికారులు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పోలీసు అధికారులు, సెంట్రల్ జైలు మరియు ప్రత్యేక మహిళా జైలు అధికారులు, తూర్పు గోదావరి జిల్లా చీఫ్ లీగల్ అయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ జె.మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *