Breaking News

ఎంపి కేశినేని శివనాథ్ ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన ఎయిమ్స్ డైరెక్టర్‌ డాక్టర్‌ మాధబానంద కర్‌

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళగిరి ఎయిమ్స్ పాలకమండలి సభ్యుడు, విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ ను మంగ‌ళ‌గిరి ఎయిమ్స్ డైరెక్ట‌ర్ ప్రొఫెస‌ర్. డాక్ట‌ర్ మాధ‌బానంద్ క‌ర్ ( Prof. Dr. Madhabananda Kar) మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు.. గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో ఎంపి కేశినేని శివ‌నాథ్ కు పుష్ప‌గుచ్ఛం అందించి శాలువాతో స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఇరువురు మంగ‌ళ‌గిరి ఎయిమ్స్ అభివృద్ది ప‌నుల‌పై కాసేపు చ‌ర్చించుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మంగ‌ళ‌గిరి ఎయిమ్స్ డిప్యూటీ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) కల్నల్ శశికాంత్ తుమ్మ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *