Breaking News

అలిపిరి ప్రాంతంలో అనుమానిత కల్తీ పసుపు, కుంకుమ విక్రయదారులపై దాడులు నిర్వహించి అవగాహన కల్పించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘
కల్తీ ఆహార పదార్థాలు విక్రయం చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఆహార భద్రత కంట్రోలర్ అధికారి వెంకటేశ్వర్ రావు పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ గారి ఆదేశాల మేరకు అలిపిరి ప్రాంతంలో మరియు మెట్ల ప్రాంతంలో కల్తీ పసుపు, కుంకుమ ఆహార పదార్థాల విక్రయం జరుగుతోందని ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో జిల్లా ఆహార భద్రత కంట్రోలర్, ఫుడ్ సేఫ్టీ అధికారులు, మునిసిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అనుమానిత కల్తీ పసుపు, కుంకుమ విక్రయిస్తున్న వాటిని సీజ్ చేయడం జరిగిందని, అలాగే వారికి అవగాహన కల్పించడం జరిగిందనీ ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మద్దిలేటి, జగదీష్, మునిసిపల్ సతీష్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *