విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో శనివారం అశోక్ నగర్ లోని తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని పట్టభద్రులను ఓటింగ్ కు తీసుకువచ్చేలా చర్యలు చేపట్టెందుకు నియోజకవర్గం పోల్ మేనేజ్ మెంట్ సభ్యులతో గద్దె క్రాంతికుమార్ నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాప్ చైర్మన్ రవి నాయుడు, నియోజకవర్గం టీడీపీ పరిశీలకులు వెలగపూడి శంకర్ బాబులు హాజరై సభ్యులకు పలు సూచనలు చేశారు. నియోజకవర్గంలో అత్యధిక శాతం పట్టభధ్రులు ఓటింగ్ కు హాజరయ్యేలా కూటమి శ్రేణులు కృషి చేయాలని కోరారు.
Prajavartha Online Telugu News