విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం ఎన్టిఆర్ జిల్లా గీతకులాలకు సంబంధించిన మద్యం దుకాణాల కేటాయింపునకు సంబంధించి విజయవాడ రూరల్, గొల్లపూడి బీసీ భవన్ లో ఎన్టిఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆధ్వర్యంలో లాటరీ ద్వారా షాపుల కేటాయింపు ప్రక్రియ నిర్వహించడమైనది. ఎన్టిఆర్ జిల్లా వ్యాప్తంగా అన్లైన్ ద్వారా మరియు ఆఫ్లైన్ ద్వారా 335 దరఖాస్తులు 11 మద్యం దుకాణాలకు రావడమైనది. లాటరీ ప్రక్రియ ద్వారా 11 మద్యం దుకాణాలను దరఖాస్తుదారులకు కేటాయించడమయింది. 11 మద్యం దుకాణాలకు ప్రోవిజనల్ లైసెన్సు జారీచేయడం జరుగుతుంది. కార్యక్రమంలో ఎక్సైజ్అధికారులు టి.శ్రీనివాసరావు, ఎస్. శ్రీనివాసరావు, రామశివ మరియు ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News