ఒంటిమిట్ట, నేటి పత్రిక ప్రజావార్త :
ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు బెంగూళూరుకు చెందిన స్ఫూర్తి రావు ఆలపించిన శ్రీరామ గానామృతంతో భక్తులు తన్మయత్వం చెందారు. అంతకుముందు తిరుపతి ఎస్వీ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు ” శ్రీరామ వైభవం ” పై నృత్య రూపకం ప్రదర్శించారు. ఇందలో విశ్వమిత్ర మహర్షి యాగ రక్షణార్థం రామలక్ష్మణులను అశ్రమానికి తీసుకువెళ్ళడం, అక్కడ రాక్షసులను సంహరించడం ప్రదర్శించారు. అనంతరం సీతా రాముల కల్యాణం కథను చక్కగా భక్తి భావంతో ప్రదర్శించిన తీరు చూపరులను ఆకట్టుకున్నది. ” రామరామ జయ రామ….” కీర్తనకు డప్పు, చక్క భజనలతో సాంప్రదాయ జానపద నృత్యం ఎంతగానో అలరించాయి. అనంతరం రాత్రి 8.30 గంటలకు శ్రీరామనామ భజనామృతంతో కల్యాణోత్సవం ముగిసింది.
Tags amaravathi
Check Also
మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …
Prajavartha Online Telugu News