Breaking News

సీతా రామ కళ్యాణం దర్శించడం మన అదృష్టం

-మీ భక్తిని చూసి ఆకర్షితుడినయ్యాను
-వొంటిమిట్టను దేవాలయ పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేస్తాం
-కొండలపై ఆయుర్వేద మొక్కల పెంపకం
-తిరుమలలో గోవింద నామం మాదిరిగా వొంటిమిట్టలో ‘జై శ్రీరామ్’ నినాదమే ప్రతిధ్వనించాలి
-వొంటిమిట్టలోనూ త్వరలో అన్నప్రసాదం ప్రారంభం
-శ్రీరాముడు పవిత్ర కుటుంబ సంబంధాలకి ఆదర్శం
-శ్రీరాముని వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి
-రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

వొంటిమిట్ట, నేటి పత్రిక ప్రజావార్త :
కడప జిల్లాలోని వొంటిమిట్టలో జరిగిన భవ్యమైన సీతా రామ కళ్యాణ మహోత్సవం ముగిసిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ, శ్రీరామ రాజ్యాన్ని మళ్ళీ స్థాపించాలనే తపన తనదని, ప్రజలందరూ శ్రీరాముడు చూపించిన నీతి, ధర్మ మార్గాన్ని అనుసరించి జీవించాలని ఆకాంక్షించారు.

కళ్యాణ వేదిక వద్ద జరిగిన ఈ సీతారాముల కళ్యాణాన్ని తిలకించేందుకు భారీగా తరలివచ్చిన భక్తులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ దివ్య కళ్యాణాన్ని వీక్షించడం ప్రతి ఒక్కరికీ అదృష్టంగా పేర్కొన్నారు.

శ్రీరాముడు ఒక వాగ్దానాన్ని ఎలా నిలబెట్టుకోవాలో, తండ్రి ఆజ్ఞను ఎలా విధిగా పాటించాలో, కుటుంబ బంధాలను ఎలా పరిపూర్ణంగా పోషించాలో తెలియజేశారని సీఎం అన్నారు.

“తిరుమలలో గోవింద నామం ప్రతిధ్వనిస్తున్న విధంగా, వొంటిమిట్టలో ‘జై శ్రీరామ్’ నినాదమే మిన్నగా వినిపించాలి. రాష్ట్ర విభజన తర్వాత వొంటిమిట్టను ప్రధాన పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయడానికి ఈ ఆలయాన్ని దశాబ్ద కాలం క్రితమే టిటిడి కి ఇవ్వడమైనదన్నారు.

“ఈ సంతోషకరమైన సందర్భంగా, తిరుమల మాదిరిగా వొంటిమిట్టలో కూడా అన్నప్రసాదం ప్రారంభించాలన్న నిశ్చయాన్ని టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు తీసుకోవాలని కోరుతున్నాను,” అని భక్తుల హర్షధ్వానాల నడుమ తెలిపారు.

వొంటిమిట్టను పుణ్యభూమిగా మార్చేందుకు ఇక్కడి కొండలపై ఆయుర్వేద మొక్కలను నాటనున్నట్టు తెలిపారు. అదేవిధంగా వొంటిమిట్టను దేవాలయ పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది 2047 నాటికి ప్రపంచంలో నంబర్ వన్ దేశంగా మారుతుంది అని సీఎం చెప్పారు.

తర్వాత టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వొంటిమిట్టలో అన్నప్రసాదం త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి మంత్రి సవితా, దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ ఈవో జే.శ్యామల రావు, జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి, ప్రజాప్రతినిధులు, బోర్డు సభ్యులు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *