Breaking News

మంగళగిరి మండల ప్రజానీకానికి పోలీసువారి విజ్ఞప్తి మరియు సూచనలు

-మంగళగిరి గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్

మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
మండలంలో ఈ మధ్యకాలంలో ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నందున ప్రజలందరికీ తెలియజేయునది ఏమనగా గ్రామంలో ఉన్న ప్రజలు మీరు బయట ఊళ్ళకు కి వెళ్లేటప్పుడు అనగా తీర్థయాత్రలకు, విహారయాత్రలకు, పెళ్లిళ్లకు , మొదలగువాటికి వెళ్ళేటప్పుడు సదరు విషయాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్ లో తెలియపరచవలసిందిగా మరియు LHMS (locked house monitoring system) వారికి తెలియపరిచిన ఎడల వారు వచ్చి మీ ఇంటికి LHMS ను అమర్చి వెళతారు ఈ రకంగా దొంగతనం అరికట్టగలము, అలాగే సదర విషయాన్ని 100, 112 కు డయల్ చేసి తెలపగలరని గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ తెలిపారు. అలానే ద్విచక్ర వాహన దొంగతనాలు కూడా ఎక్కువగా జరుగుతున్నందున మీ యొక్క ద్విచక్ర వాహనాలను ఇంటి ముందు పార్కు చేసేటప్పుడు హ్యాండిల్ లాక్ మరియు గొలుసు సహాయంతో లాక్ చేయగలరని తెలియపరచడమైనది. కావున మంగళగిరి మండల ప్రజలు పోలీసు వారికి సహకరించాలని మంగళగిరి గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *