Breaking News

ర్యాలీలో నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా మంగళవారం (27వ తేదీ) ఉదయం 7 గంటలకు బృందావన్ గార్డెన్స్ ఎన్టీఆర్ మునిసిపల్ స్టేడియం నుండి లక్ష్మీపురం మధర్ థెరిస్సా విగ్రహం వరకు ర్యాలీ జరగుతుందని, ర్యాలీలో జిల్లా కలెక్టర్, అధికారులు పాల్గొంటారని, నగరంలోని యువత, సీనియర్ సిటిజన్స్, విద్యార్ధులు, స్వచ్చంద సంస్థలు పాల్గొని విజయవంతం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21 నుండి జూన్ 21 వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2025లో గుంటూరు నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనెలా అవగాహన కల్గించడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇప్పటికే వార్డ్ సచివాలయాల వారీగా యోగంధ్ర వెబ్ సైట్ లో యోగా పై ఆసక్తి కల్గి, దేశ ప్రధాని పాల్గొనే వైజాగ్ లో జరిగే సదస్సు కు వెళ్ళాలనుకునే వారి రిజిస్ట్రేషన్ చేస్తున్నామని తెలిపారు. మంగళవారం జరిగే ర్యాలీలో నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *