విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలోని ఘంటసాల ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రాంగణంలో చిన్న సినిమాగా రూపొందుతున్న “పవర్” చిత్రం గురువారం నాడు ప్రారంభమైంది. వీఆర్పీ క్రియేషన్స్ పతాకంపై వెంకటరమణ పసుపులేటి దర్శకత్వంలో పరిమిత బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిన్న సినిమా ముహూర్తపు సన్నివేశానికి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కెమెరా స్విచ్ ఆన్ చేసి, తొలి క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. పరిమిత బడ్జెట్తో నూతన ఆలోచనలతో వస్తున్న ‘పవర్’ చిత్రం పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు. చిత్రయూనిట్కు తన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, సినిమా విజవంతం కావాలని శుభాకాంక్షలు అందజేశారు.
Prajavartha Online Telugu News