Breaking News

ముఖ్యమంత్రి మాడుగుల పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర

-పర్యటనను ఘన విజయం చేసే బాధ్యతను ప్రతి కార్యకర్త తీసుకోవాలి

అనకాపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాడుగుల పర్యటన ఘన విజయం చేసేలా ప్రతి కార్యకర్త బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు మాడుగుల నియోజకవర్గం కె.కోటపాడు మండలంలో జోనల్ పరిశీలకులు బెందాళం అశోక్, జిల్లా పార్టీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు, ఎమ్మెల్యే బండారు సత్యన్నారాయణమూర్తి గారితో కలిసి కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మూడవ శనివారం ముఖ్యమంత్రి ఒక నియోజకవర్గంలో పాల్గొంటున్నారని తెలిపారు. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నపుడే ఆరోగ్యం సాధ్యమవుతుందని, పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అనంతరం కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం ఉంటుందని తెలిపారు. అనంతరం కూటమి నాయకులతో కలిసి సభావేదిక ఏర్పాట్లను పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ASSOCHAM ప్రతిష్ఠాత్మక “బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్” అవార్డును అందుకున్న APMDC

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *