-ASR అంతర్జాతీయ విమానాశ్రయంలో బస్స్టాండ్, చార్జింగ్ స్టేషన్ను పరిశీలించిన మంత్రి మండిపల్లి
-ప్రతి అరగంటకు ఎలక్ట్రిక్ బస్సు.. మంత్రి మండిపల్లికి వివరించిన RM
-ప్రయాణికుల సౌకర్యాలపై ఏఎస్ఆర్ విమానాశ్రయంలో మంత్రి మండిపల్లి ఆరా
విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖపట్నం నుంచి ఎలక్ట్రిక్ బస్సులో ఏఎస్ఆర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన బస్స్టాండ్, చార్జింగ్ స్టేషన్ను పరిశీలించారు. ప్రయాణికులతో మాట్లాడి విశాఖపట్నం నుంచి విమానాశ్రయానికి కల్పించిన ఆర్టీసీ రవాణా సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి అరగంటకు ఒక ఎలక్ట్రిక్ బస్సును నడుపుతున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు మంత్రికి వివరించారు.
Prajavartha Online Telugu News