మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ, రాష్ట్ర రహదారులపై వాహనదారులు రోడ్డు దాటే సమయంలో మరింత అప్రమత్తతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ సూచించారు. సోమవారం ఆయన విజయవాడ నుండి మచిలీపట్నంలో జరిగే స్పందన కార్యక్రమానికి వస్తున్న సమయంలో గూడూరు మండలం తరకటూరు వద్ద అప్పుడే జరిగిన వాహన ప్రమాదంను కలెక్టర్ జె. నివాస్ గుర్తించారు. ప్రమాదం ఏవిధంగా జరిగిందోనని స్థానికులను ఆయన అడిగి తెలుసుకున్నారు. యాక్టివా బైక్ పై వెళ్లున్న మచిలీపట్నం ఇంగ్లీష్ పాలెంకు చెందిన అబ్దుల్ ఉల్ఫాస్ (38 …
Read More »Konduri Srinivasa Rao
మూడు సర్కిల్ కార్యాలయములలో జోనల్ కమిషనర్ల అధ్యక్షతన “స్పందన”
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఎ.ఎస్ ఆదేశాల మేరకు సర్కిల్ -1 నందు జోనల్ కమిషనర్ డా.రవి చంద్ చే నిర్వహించిన స్పందన కార్యక్రమములో ఉద్యానవన విభాగమునకు సంబందించి 1 అర్జి సమర్పించుట జరిగింది. సర్కిల్ -2 నందు జోనల్ కమిషనర్ కె.వి.ఆర్.ఆర్.రాజుచే నిర్వహించిన స్పందన కార్యక్రమములో ప్రజారోగ్య శాఖ -1, పట్టణ ప్రణాళిక విభాగమునకు సంబంధించి-1 అర్జి మొత్తం 2 అర్జిలు సమర్పించుట జరిగింది. సర్కిల్ -3 నందు జోనల్ కమిషనర్ ఎల్.పార్ధసారధి చే నిర్వహించిన …
Read More »ప్రజలు సమస్యల పరిష్కార వేదిక స్పందన…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుంచి వచ్చిన సమస్యల అర్జీలను క్షేత్ర స్థాయిలో పరిశిలించి సత్వరమే పరిష్కరించాలని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ అధికారులను ఆదేశించారు. విజయవాడ నగర పాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమములో మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్వయంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజలు సమర్పించిన అర్జీలను పరిశీలించి వాటిని సత్వరమే పరిష్కారించేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమములో పట్టణ ప్రణాళిక -4, పబ్లిక్ హెల్త్ …
Read More »ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా రూ. 7.41 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో 35 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 7 లక్షల 41 వేలకు సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి …
Read More »సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 57, 60, 61వ డివిజన్ లలో నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 57, 60, 61వ డివిజన్ లలో నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీ జరిగింది. 60వ డివిజన్ వాంబే కాలనీలోని 262 వ వార్డు సచివాలయం, 57వ డివిజన్ లోని 233వ వార్డు సచివాలయాలలో కార్యక్రమ నిర్వహించారు. 57వ డివిజన్ లో 22 మంది, 60 వ డివిజన్ లో 9 మంది, 61వ డివిజన్ లో 5 మంది అర్హులకు నూతన పెన్షన్లు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ రాష్ట్రంలో …
Read More »పింఛన్ల గూర్చి మాట్లాడే నైతిక అర్హత తెలుగుదేశానికి లేదు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-28వ డివిజన్ లో నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ వ్యవస్థను సరళీకృతం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. 28వ డివిజన్ లో నూతనంగా మంజూరైన 27 పింఛన్లను లక్ష్మీ నగర్లోని 203 వార్డు సచివాలయంలో APSFL ఛైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి తో కలిసి ఆయన పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. …
Read More »పింగళి వెంకయ్య తెలుగు వారు కావడం మనందరికి గర్వకారణం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
–ఎమ్మెల్యే చేతులమీదుగా దుర్గాపురం వాకర్స్ క్లబ్ లో పింగళి వెంకయ్య విగ్రహావిష్కరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతి సమైక్యత, సమగ్రతకు చిహ్నమైన త్రివర్ణ పతాక రూపకర్త తెలుగు వారు కావడం మనందరికీ గర్వకారణమని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. పింగళి వెంకయ్య జయంతిని పురస్కరించుకుని దుర్గాపురం వాకర్స్ క్లబ్ నందు ఆయన విగ్రహావిష్కరణ, ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ భిన్నత్వంలోని ఏకత్వం, సమతాస్ఫూర్తికి మన …
Read More »జాతీయ బీసీ సంఘం జాతీయ కార్యదర్శి గా ఎన్.వి.ఎస్ ప్రసాద్ నియామకం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ బీసీ సంఘం జాతీయ కార్యదర్శి గా ఎన్.వి.ఎస్ ప్రసాద్ ని నియమించినట్లు జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు దేరంగుల ఉదయ్ కిరణ్ ఆదివారం ఓ ప్రకటన లో తెలిపారు. విజయవాడ చెందిన ఎన్.విఎస్ ప్రసాద్ బీసీ సంఘం హక్కులకోసం సేవలందించి బీసీల కోసం పోరాటం చేసిన వ్యక్తి అని, ఎల్లవేళలా బీసీలకు అందుబాటులో ఉండి బీసీల కోసం నిరంతరం కృషి చేస్తున్నందుకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. బీసీ సంఘం పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్త కమిటీలు …
Read More »బొమ్మినంపాడులో క్యాంబ్ బెల్ కాల్వ పై రూ. 10 లక్షలతో కాలిబాట వంతెన నిర్మించడం సంతోషంగా ఉంది…
-త్వరలో కొల్లేరు పైన ర్యేగులేటర్, గరిసిపూడి వద్ద ర్యేగులేటర్ నిర్మాణాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు… -ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ -శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు ముదినేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : చిరకాలంగా ఉన్న గ్రామ సమస్యను యంపీ నిధుల నుండి పరిష్కరించడం ఎంతో సంతృప్తినిచ్చిందని ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ అన్నారు. ఆదివారం సాయంత్రం ముదినేపల్లి మండలంలోని బొమ్మినంపాడు గ్రామంలో క్యాంబ్ బెల్ కాల్వ పై నాగమ్మ తల్లి గుడివద్ద నూతనంగా నిర్మించిన కాలిబాట వంతెనను …
Read More »వ్యవసాయానికి పవర్ ఫుల్ పంపుసెట్లు…
-పీఎంబీఎల్డీసి మోటర్ల ఆవిష్కారం పై పరిశోధనకు ఏ పీ సీడ్కో శ్రీకారం -పంపుసెట్ల సామర్థ్యం పెంపు, వాటి జీవిత కాలాన్ని రెట్టింపు చేయటమే లక్ష్యం -ఆంధ్రా యూనివర్సిటీ తో ఎంఓయూ -పీఎంబీఎల్డీసి టెక్నాలజీ తో 90 శాతానికి పెరగనున్న వ్యవసాయ పంపుసెట్ల సామర్థ్యం -10 నుంచి 20 సంవత్సరకు పెరగనున్న పంపుసెట్ల జీవిత కాలం -పీ ఎం బీ ఎల్ డీ సి, ఇంధన సామర్ధ్య సాంకేతికలతో వ్యవసాయ రంగంలో 30 శాతం వరకు విద్యుత్ ఆదా చేసే అవకాశం -సాంప్రదాయ ఇండక్షన్ మోటర్లకు …
Read More »
Prajavartha Online Telugu News