Breaking News

Andhra Pradesh

ఈ నెల 29న చంద్రగూడెంలో ప్ర‌త్యేక గ్రీవెన్స్‌

– స్థానిక ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకోవాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌భుత్వం ప్రజలకు మరింత చేరువగా పరిపాలన అందించాలనే లక్ష్యంతో గౌర‌వ ముఖ్య‌మంత్రి మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలోనూ ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) నిర్వ‌హించ‌డం జ‌రుగుతోంద‌ని.. ఈ నెల 29వ తేదీ శుక్ర‌వారం మైలవరం నియోజకవర్గం స్థాయిలో చంద్రగూడెంలో ప్ర‌త్యేక గ్రీవెన్స్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ఉద‌యం 10 గంట‌ల నుంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద …

Read More »

ఆక్వా రంగ స్థిరత్వానికి పారదర్శక విధానాలే పరిష్కారం

– ఫీడ్, సీడ్ నాణ్యతపై కఠిన పర్యవేక్షణ : మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆక్వాకల్చర్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రింప్ ఫీడ్ ధరల పెరుగుదల, ముడి పదార్థాల కొరత, రైతులపై పెరుగుతున్న వ్యయభారం, ఎగుమతుల సవాళ్లు వంటి అంశాలపై మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో రైతులు, ఫీడ్ తయారీదారులు, ఎగుమతిదారులు, పరిశ్రమ ప్రతినిధుల అభిప్రాయాలను ప్రభుత్వం సమగ్రంగా విన్నదన్నారు. …

Read More »

గర్భిణిలు, శిశువుల కోసం అత్యాధునిక వైద్యం

-గుంటూరు జీజీహెచ్ మాతా-శిశు సూపర్ స్పెషాల్టీ బ్లాక్ లో ప్రారంభమైన శస్త్ర చికిత్సలు -ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా అత్యాధునిక సౌకర్యాలతో 10 థియేటర్లు సిద్ధం -శిశువుల అత్యవసర చికిత్స కోసం టోటల్ బాడీ కూలింగ్ మెషిన్ లు, హై ప్రీక్వెన్సీ వెంటిలేటర్లు రెడీ -సూపర్ స్పెషాలిటీ బ్లాక్ నిర్మాణానికి, జీoఖానా తరపున రూ. 100 కోట్ల వ్యయo -మెషిన్లు, పరికరాల కొనుగోళ్లకు రూ. 27 కోట్లు ఖర్చుపెట్టిన ప్రభుత్వం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు ఉత్తమ వైద్య సేవల్ని చేరువ …

Read More »

కళామతల్లి ముద్దుబిడ్డ యన్ టి ఆర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సినిమా ప్రపంచంలో తన నటనతో తను చేయలేని పాత్రలే లేనట్లుగా చిరస్మరణీయమైన పాత్రలు చేసి సినీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి తెలుగు భాషా ఖ్యాతిని ప్రపంచ పటంలో చూపిన ఏకైక నటుడు కళామతల్లికి ముద్దుబిడ్డ కీర్తిశేషులు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు అని స్టార్ సిటీ నైన్ వ్యవస్థాపకులు కామన్ మెన్ రమేష్ తెలిపారు. గురువారం నాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 103 వ జయంతి సందర్భంగా STARS CITY9 సకళ …

Read More »

ఆసుపత్రుల పనితీరు మెరుగుపడకుంటే చర్యలు తప్పవు

-ఐవీఆర్ఎస్ ఫలితాల ఆధారంగా పనితీరులో అట్టడుగున ఉన్న ఆసుపత్రుల మెడికల్ సూపరింటెండెంట్లతో ప్రత్యేక సదస్సులు -ప్రైమరీ, సెకండరీ, టీచింగ్ ఆసుపత్రుల వారీగా -జిల్లాల నుంచి తరలివచ్చిన అధికారులు -సీఎం చంద్రబాబు, మంత్రి సత్యకుమార్ ఆదేశాల మేరకు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రోగులకు వైద్య సేవలు అందించడంలో వెనుకబడిన ప్రభుత్వాసుపత్రులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఆసుపత్రుల పనితీరుపై ఐవీఆర్ఎస్ ద్వారా రోగుల నుంచి సేకరించిన సేవల సంతృప్తి (పబ్లిక్ పర్సప్షన్) స్థాయి అనుసరించి పనితీరులో వెనుకబడినట్లు గుర్తించిన …

Read More »

గోదావరి సహా రాష్ట్ర ప్రధాన నదుల్లో కాలుష్య నివారణకు “ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్” ఏర్పాటు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి పుష్కరాలు–2027 దృష్ట్యా గోదావరి నది సహా రాష్ట్రంలోని ప్రధాన నదుల్లో కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ చర్యలను సమర్థవంతంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం “ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్”ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజమహేంద్రవరం వద్ద గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. పర్యావరణ, అటవీ శాఖ ప్రధాన కార్యదర్శి …

Read More »

రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించిన సి.ఎస్.

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముద్ఖేడ్–మెడ్చల్–మహబూబ్‌నగర్–ధోన్ రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పరిధిలో భూసేకరణ, ప్రభుత్వ భూముల బదలాయింపు తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం వేగవంతమైన చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. బుధవారం డిల్లీ నుండి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించిన ప్రగతి (PRAGATI) వీడియో కాన్పరెన్సులో దేశవ్యాప్తంగా వివిధ కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులు, జాతీయ పథకాల అమలు పురోగతిని సమీక్షించారు. ఈ సందర్బంగా …

Read More »

ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు మరింత సమర్థవంతంగా చేరవేస్తా

-ప్రతి బాధ్యత తనకు ఒక కొత్త అనుభవాన్ని నేర్పింది -అదనపు సంచాలకులు (ఇంచార్జి) గా నియమితులైన పోతుల కిరణ్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అధికారులు తనకు కల్పించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగానని, సమాచార శాఖలో నిర్వర్తించిన ప్రతి బాధ్యత తనకు కొత్త అనుభవాన్ని, విలువైన పాఠాలను నేర్పిందని అదనపు సంచాలకులు (ఇంచార్జి) గా నియమితులైన పోతుల కిరణ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం జాయింట్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్న పి.కిరణ్ కుమార్ సేవలను గుర్తించిన ప్రభుత్వం, ఆయనకు అడిషనల్ …

Read More »

“మా మధ్య ఉన్నది ప్రజా సంక్షేమ సంకల్పం మాత్రమే… రాజకీయ కాలుష్యం కాదు!..ట్రోలర్లకు మంత్రి దుర్గేష్ ఘాటు కౌంటర్!

-గోదావరి పవిత్రత దెబ్బతింటే ఊరుకోం… డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు శిరోధార్యం!:మంత్రి దుర్గేష్ -“పర్యావరణ విధ్వంసకారులకు, నిబంధనలు పాటించని పరిశ్రమలదారులకు మంత్రి కందుల దుర్గేష్ ఘాటు హెచ్చరిక! -గోదావరి కాలుష్య నివారణే ధ్యేయం… పీసీబీ నోడల్ ఏజెన్సీగా ‘స్పెషల్ టాస్క్ ఫోర్స్’ ఏర్పాటు… జీవో జారీ చేసిన ప్రభుత్వం! -త్వరలోనే గోదావరి నదిపై సమగ్ర ‘పొల్యూషన్ ఆడిట్’… పర్యావరణ ప్రమాణాలు ఉల్లంఘిస్తే ఎంతటి పరిశ్రమనైనా ఉపేక్షించం! -గోదావరి జలాలను కలుషితం చేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతామంటే సహించబోమని మాస్ వార్నింగ్! -“ఇకపై మురుగు …

Read More »

విద్యుత్ అంతరాయాల నివారణకు ప్ర‌త్యేక‌ చర్యలు

-అంత‌రాయాల‌పై ప్రజలకూ స‌మ‌గ్ర‌ సమాచారం అందించాలి -ప్ర‌జ‌ల‌ను, విద్యుత్ శాఖ‌నూ కాల్ సెంట‌ర్లు స‌మ‌న్వ‌యం చేయాలి -ఇంధ‌నశాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప‌్ర‌జ‌ల‌కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ అంత‌రాయాల నివార‌ణ‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వి కుమార్ అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అధిక వేడి, అకాల‌ గాలివాన‌లతో ఫీడ‌ర్లు తెగిపోయి విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్న పరిస్థితిపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ బుధవారం ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫ‌రెన్స్ …

Read More »