Breaking News

Monthly Archives: April 2026

మే 5న మొక్కజొన్న పంట కొనుగోలు చేయాలని ధర్నాలు

-సిపిఐ, ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సుమారు 12.5 లక్షల ఎకరాల్లో రైతాంగం పండించిన మొక్కజొన్న పంటను మార్క్‌ఫెడ్, నాఫెడ్‌ల ద్వారా సత్వరం కొనుగోలు కేంద్రాలు తెరచి మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేయాలని సిపిఐ, ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం ఆధ్వర్యంలో మే 5వ తేదీన మండల కేంద్రాలలో ధర్నాలు నిర్వహించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య, రైతుసంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి.ప్రసాద్‌లు నేడొక ప్రకటనలో పిలుపునిచ్చారు. రైతాంగం లాభాలు వచ్చే పంటలవైపు దృష్టిసారించాలని రైతాంగాన్ని …

Read More »

పెట్రోల్, డీజిల్ కొరతపై కేంద్రం నిద్ర నటిస్తోంది

– సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పెట్రోల్, డీజిల్ కొరత గత కొద్దికాలంగా తెలుగు రాష్ట్రాల్లో వెన్నాడుతున్నప్పటికీ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కొరత ఏమీలేదని చెప్పడాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తప్ప్పుబట్టారు. డీజిల్, పెట్రోల్ కొరతపై కేంద్ర ప్రభుత్వం నిద్ర నటిస్తోందన్నారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర సమస్యగా మారింది. కాని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి …

Read More »

ప్రతీ బూత్ పరిధిలో గతానికి మించి ఓట్లు రావాలి

-చేసిన అభివృద్ధి చెబుదాం… తెచ్చిన మార్పు చెబుదాం… పడిన కష్టం చెబుదాం -లోకేష్… శభాష్ -పర్మిషన్లతో కాదు… పనితోనే పదవులు -సీనియార్టీ… సిన్సియార్టీ… సోషల్ రీ-ఇంజనీరింగ్ తో కమిటీ కూర్పు -అహం వద్దు… బేషజాలకు పోవద్దు -2024కు ముందు జరిగిన ప్రతీ ఘటన గుర్తుంది… మనం చేసిన ప్రతీ పోరాటం గుర్తుంది -గూగులే కాదు… స్వాతంత్ర్యం తెచ్చామని కూడా గొడ్డలి పార్టీ చెబుతుంది -టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభలో సీఎం చంద్రబాబు -కొత్త కార్యవర్గంతో ప్రమాణస్వీకారం చేయించిన చంద్రబాబు అమరావతి,  నేటి …

Read More »

డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలూ ఆన్‌లైన్

-శరవేగంగా డ్రోన్ సిటీ మొదటి దశ పనులు -శాటిలైట్ సమాచారం వినియోగించుకునేలా కార్యాచరణ -ఆర్టీజీ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ శాఖలు అందిస్తున్న అన్ని సేవలు ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా ఆన్‌లైన్‌లో అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వాట్సప్ గవర్నెన్స్ మన మిత్ర పరిధిలోకి అన్ని సేవలు తీసుకు వస్తే ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని ఉండదని చెప్పారు. ఆర్టీజీఎస్‌పై వివిధ శాఖల ఉన్నతాధికారులతో క్యాంపు కార్యాలయంలో బుధవారం …

Read More »

డ్వాక్రా మహిళల జీవనోపాధి కోసం రూ.207.03 కోట్ల కేంద్ర నిధుల విడుదలపై కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కృతజ్ఞతలు

అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : స్వయం సహాయక సంఘాల (SHG) మహిళల జీవనోపాధిని మెరుగుపరచడం మరియు సెర్ప్ (SERP) ద్వారా ‘దీన్ దయాళ్ అంత్యోదయ యోజన – జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్’ (DAY-NRLM) పథకాన్ని అమలు చేయడం కోసం.. కేంద్ర ప్రభుత్వం తన వాటాగా మొదటి విడతలో రూ.207.03 కోట్లు మంజూరు చేయడం పట్ల రాష్ట్ర ఎంఎస్ఎంఈ (MSME), సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత మరియు సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను, …

Read More »

సముద్ర వనరుల ద్వారా స్థానిక సముదాయాలకు లాభాలు చేకూరేలా చర్యలు

-మత్స్య సంపదలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం – అక్రమ వేటపై కట్టడి చర్యలు -జీవవైవిధ్య చట్టం అమలు ద్వారా మత్స్యకారులు, రైతులకు లెవీ బదిలీ –ఏపీఎస్‌బీబీ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బయోడైవర్సిటీ చట్టం లోని యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ (ABS) విధానం ద్వారా ప్రకృతి వనరుల వినియోగం వల్ల వచ్చే లాభాలను స్థానిక ప్రజలకు చేరవేయడం ప్రధాన లక్ష్యమని ఏపీఎస్‌బీబీ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ తెలిపారు. యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ వ‌ల్ల చేప‌ల …

Read More »

ముఖ్యమంత్రి పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ బీ విద్యాసాగర్ నాయుడు శిక్షణలో ఉన్న కలెక్టర్ నమ్రత అగర్వాల్ తో కలసి పమిడిముక్కల మండలంలో ముందస్తు భద్రత సమన్వయ ( ఏ ఎస్ ఎల్) ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం వారు పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా తో కలిసి అధికారులతో సమన్వయ సమావేశం …

Read More »

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు వేగవంతం చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు వేగవంతం చేయాలని, బుధవారం రాత్రి కల్లా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చే మే నెల 1వ తేదీన పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలంలో పర్యటిస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ బుధవారం ఉదయం మండలంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివిధ శాఖ అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. తొలుత కలెక్టర్ మండలంలోని కపిలేశ్వరపురం గ్రామంలో …

Read More »

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రేపు, ఎల్లుండి ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎండతీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన అకాల వర్షాల కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుధవారం నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 44.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు ప్రఖర్ జైన్ తెలిపారు. మొత్తం 28 జిల్లాలకు గాను 16 జిల్లాల …

Read More »

హైకోర్టు ఏజీపీ ల గౌరవ వేతనం 25 శాతం పెంపు

-రూ.44,000 నుండి రూ.55,000 కు పెంచుతూ సీఎం నిర్ణయం -జిల్లా కోర్టుల్లో జీపీ లు, ఏజీపీలకు కూడా పెంచే ప్రతిపాదన -రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టులో పనిచేస్తున్న ఏజీపీల ( అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్లు) గౌరవ వేతనాన్ని 25 శాతం పెంచుతూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర న్యాయ,మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అమరావతిలో బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో …

Read More »