Breaking News

Daily Archives: August 12, 2026

“కంపెనీ Specific డ్రైవ్”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.14.08.2026 శుక్రవారం ఉదయం 09:00 గంటలకు మన విజయవాడ లోని ఆధ్యా స్టోర్ (The Unit of Rama), పాత SBI బ్రాంచ్, ఆపోజిట్: జూడియో స్టోర్స్, D.No: 59-13-4, ఘంటసాల వారి స్ట్రీట్, గాయత్రీ నగర్, విజయవాడ నందు “కంపెనీ Specific డ్రైవ్” నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి మరియు నైపుణ్య అధికారి సి. మధుభూషణ్ రావు గారు …

Read More »

విత్తనం నాటిన ప్రతి రైతుకు ఫసల్ బీమా

-రైతుల ఆర్థిక భద్రతకు 100 శాతం ఫసల్ బీమా నమోదు -ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద విత్తనం నాటిన ప్రతి రైతును పంటల బీమా పరిధిలోకి తీసుకురావాలి -జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ కలెక్టరేట్ నుండి కలెక్టర్ లక్ష్మీశ.. జిల్లా రెవిన్యూ అధికారి యం.లక్ష్మీ నరసింహo, జిల్లాస్థాయి అధికారులతో కలసి కలెక్టర్ కార్యాలయం నుంచి ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వివిధ శాఖల క్షేత్రస్థాయి అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మిశ …

Read More »

వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు సమన్వయంతో పనిచేయాలి

-2026లో ఎన్టీఆర్ జిల్లాలో గణనీయంగా తగ్గిన డెంగ్యూ, మలేరియా కేసులు -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ కలెక్టర్ కార్యాలయం నుండి బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సీజనల్ వ్యాధుల నియంత్రణపై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ, 2025తో పోలిస్తే 2026లో ఎన్టీఆర్ జిల్లాలో డెంగ్యూ, మలేరియా కేసులు గణనీయంగా తగ్గాయని తెలిపారు. 2025లో 23 డెంగ్యూ, 41 మలేరియా కేసులు నమోదుకాగా, 2026లో …

Read More »

అవగాహనతో ఎయిడ్స్‌ను జయిద్దాం

-ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -హెచ్‌ఐవీని నియంత్రించడంలో క్రమం తప్పకుండా మందుల వినియోగం కీలకం -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, వ్యాధి నియంత్రణకు ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకునేలా ప్రజలను చైతన్యపరచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. అవగాహన, అప్రమత్తత, సకాలంలో వైద్య పరీక్షలు, క్రమం తప్పకుండా మందుల వినియోగంతో హెచ్‌ఐవీని సమర్థవంతంగా నియంత్రించవచ్చని తెలిపారు. హెచ్‌ఐవీ, …

Read More »

డిసెంబరు 1 నాటికి ‘95-95-99’ లక్ష్యాల సాధన

-ఎయిడ్స్‌ రహిత ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణమే ధ్యేయం -వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ పిలుపు -60 రోజుల ప్రత్యేక అవగాహన ప్రచారాన్ని ప్రారంభించిన మంత్రి -డిజిటల్‌ పర్యవేక్షణకు ‘సురక్ష’ డ్యాష్‌బోర్డ్‌ ఆవిష్కరణ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ రహిత ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, 2026 డిసెంబరు 1 నాటికి నిర్దేశిత ‘95-95-99’ లక్ష్యాలను వంద శాతం సాధించేందుకు కృషి చేస్తున్నామ‌ని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్ వెల్ల‌డించారు. ఈ సాధ‌న‌లో యువ‌త‌తో పాటు …

Read More »

గంజాయి రహిత జిల్లాగా ఎన్టీఆర్ జిల్లా

-గంజాయి సాగు, రవాణా, వినియోగంపై ఉక్కుపాదం -గంజాయి సమాచారం అందిస్తే బహుమతి – వివరాలు పూర్తిగా గోప్యం -ఈగల్ ఛాలెంజ్‌లో భాగంగా 1972కు సమాచారం అందించండి -విజయవాడ అంటే ‘బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్’ అనే నానుడికి స్వస్తి పలకాలని హితువు -గంజాయి సేవించారనే నిర్ధారణ లేకుండా ఎలాంటి సంఘటనలనూ గంజాయితో ముడిపెట్టవద్దు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ, వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో నిరంతరాయంగా …

Read More »

ఏపీఎస్‌ఆర్టీసీలో మైనారిటీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీఎస్‌ఆర్టీసీలో పనిచేస్తున్న ముస్లిం మైనారిటీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వంతో కలిసి కృషి చేస్తామని బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు, ఏపీఎస్‌ఆర్టీసీ మైనారిటీ విభాగం గౌరవ అధ్యక్షుడు సయ్యద్ భాషా తెలిపారు. విజయవాడ బుధవారం గాంధీనగర్‌ స్థానిక ప్రెస్ క్లబ్ లో మైనారిటీ ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. మైనారిటీ ఉద్యోగులకు సెలవులు ప్రయాణ అనుమతులు రంజాన్ సమయంలో విధుల విషయంలో వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రమాదాలు ఇతర సమస్యలను మతపరమైన కోణంలో కాకుండా అందరినీ …

Read More »

ఆటోనగర్ అభివృద్ధి లక్ష్యంగా ‘ఇర్ఫాన్ ప్యానెల్’ రంగప్రవేశం..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆటోనగర్ సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ మహమ్మద్ ఇర్ఫాన్ నాయకత్వంలో నూతన ప్యానెల్‌ను ఏర్పాటు చేసినట్లు ఆటోమొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ (ఏటిఏ) అధ్యక్షుడు రాజరాల వెంకటరమణారావు (బాబ్జి) ప్రకటించారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ప్యానెల్ అభ్యర్థులను పరిచయం చేస్తూ గత పాలకవర్గ వైఫల్యాలపై ధ్వజమెత్తారు. అభివృద్ధి శూన్యం అవినీతి మయం 2014 నుంచి రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న పాలకవర్గం తమ మేనిఫెస్టోలో పేర్కొన్న ఏ ఒక్క అంశాన్ని కూడా అమలు చేయలేదని రమణారావు విమర్శించారు. …

Read More »

ఇంద్రకీలాద్రిపై రికార్డు స్థాయిలో ముగిసిన ‘ఆషాఢ సారె ఉత్సవాలు

-నెల రోజుల్లో 6 లక్షలకు పైగా భక్తుల సారె సమర్పణ – గత దశాబ్ద కాలంలోనే ఆల్ టైమ్ రికార్డ్ -4 రాష్ట్రాల నుండి తరలివచ్చిన సారె బృందాలు.. తొలిసారిగా నూతన రిజిస్ట్రేషన్ ప్రక్రియ విజయం ​ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జులై 15 నుండి ఆగస్టు 12 వరకు కన్నులపండువగా జరిగిన ‘ఆషాఢ మాస సారె సమర్పణ మహోత్సవాలు’ బుధవారంతో అత్యంత వైభవంగా ముగిశాయి. ఆషాఢ మాసమంతా ఇంద్రకీలాద్రి క్షేత్రం భక్తజన …

Read More »

యువశక్తి సమాజ సేవకు అంకితం కావాలి

-అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా టీడీపీ యువత ఆధ్వర్యంలో శ్రమదానం -మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాధించిన యువత జీవితాలతో వైసీపీ చెలగాటం: గద్దె క్రాంతి కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యువత కేవలం రాజకీయాలు, ఉద్యోగాలు, చదువులకే పరిమితం కాకుండా సమాజం పట్ల బాధ్యతతో ముందుకు రావాలని టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం ఇంటర్నేషనల్ యూత్ దినోత్సవం సందర్భంగా టీడీపీ యువత ఆధ్వర్యంలో 11వ డివిజన్ పరిధిలోని దొంతిరెడ్డి మల్లేశ్వరి పార్కులో టీడీపీ …

Read More »