-వెంటనే స్పందించిన మండల టీమ్
బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆలోచనలతో ప్రతి రెవిన్యూ, డివిజన్,మండల,సచివాలయాల పరిది లో తుఫాన్ లో ప్రజల కు ఎలాంటి కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడానికి బృందాలు ఏర్పాటు చేయడం వల్ల కృష్ణ నది నీటి ప్రవాహం నుండి గొర్రెలను గొర్రెల కాఫరిని సురక్షితంగా కాపాడిన మండల టీమ్. కొల్లూరు మండలం, గాజులంక రెవెన్యూ గ్రామ, చింతలంక గ్రామానికి చెందిన పౌల్ అనే గొర్రెల కఫరీ రోజు వారీ లో బాగంగా గురువారం తన 90 గొర్రెలను మేత కోసం వేళ్ళు తుండగా అకస్మాత్తుగా కృష్ణ నది నీటి ప్రవాహం పెరగడంతో గొర్రెల కఫరీ తన 90 గొర్రెలను తనను రక్షించుకొనుటకు కేకలు వేయడంతో గ్రామస్థులు గొర్రెల కఫరీ కేకలు విని వెంటనే మండలం లో ఉన్న తుఫాన్ టీమ్ కు సకాలంలో సమాచారం ఇవ్వడంతో వెంటనే ప్రత్యేక అధికారి నాగిరెడ్డి,ఎస్ ఐ. అమరవర్ధన్, ఎస్ డి ఆర్ ఎఫ్ సత్యనారాయణ, తహశీల్దార్ కె. వెంకటేశ్వర్లు వారి బృందం వెంటనే కృష్ణ నది వడ్డుకు చేరుకొని 90 గొర్రెలను మరియు గొర్రెల కఫరీని రక్షించారు.
Prajavartha Online Telugu News