తాడేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆస్ట్రేలియాన్ కౌన్సిల్ జనరల్ ఈ సెలై జాకీ, హై కమీషనర్ ఈ ఫిలిప్స్ ఓం వారి బృందం తో సీతానగరంలోని విజయ కిలాద్రికి విచ్చేశారు. విజయకీలాద్రి ఫై ఉన్నట్టు వంటి అన్ని ఆలయాలను, మరియు క్షేత్రపాలుకుడైన 27 అడుగుల ఏకశిలా మూర్తి శ్రీ శ్రీవిఘ్నవిమోచక హనుమాన్ ను దర్శించుకున్నారు. హనుమాన్ యొక్క మూర్తిని చూసి వారు ఎంతో ఆశ్చర్యానికి, ఆనందానికి గురయ్యారు, ఈ విజయ కిలాద్రి దివ్య క్షేత్ర వాతావరణం ఎంతగానో వారికి ఆనందాన్ని కలుగ చేస్తుందని, ఈ ప్రదేశం మనసుకు ప్రశాంతంగా ఉందని వారు తెలిపారు. అనంతరం ఆశ్రమ నిర్వాహకులు శ్రీమాన్ పురాణం వెంకటాచార్యులు, అర్చక బృందం,వచ్చిన వారికి, ఆశీర్వాచనాన్ని, స్వామి వారి శేష వస్త్రాన్ని అందించారు.
Prajavartha Online Telugu News