-AP Bus Oparators నూతన కార్యవర్గానికి మంత్రి మండిపల్లి అభినందనలు
-రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన బస్ ఆపరేటర్స్ కార్యవర్గ సభ్యులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని ఏపీ బస్ ఆపరేటర్స్ నూతన కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.
నూతనంగా ఏర్పడిన కార్యవర్గ సమావేశం అనంతరం ప్రెసిడెంట్ కిరణ్, వైస్ ప్రెసిడెంట్ నాని, కార్యదర్శి రాంబాబు, ట్రెజరర్ సందీప్తో పాటు కార్యవర్గ సభ్యులు మంత్రిని కలిసి పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి మంత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రవాణా రంగ అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News