విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ బుధువారం అధికారులతో కలసి నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయ ఆవరణలో నిర్మాణలో ఉన్న నూతన భవనమును పరిశీలించారు. ఈ సందర్భంలో భవన నిర్మాణము యొక్క స్థితిగతులను మరియు అక్కడ అందుబాటులో గల మౌలిక సదుపాయాలు మొదలగు వివరాలను అధికారులను అడిగి తెలుసుకొన్నారు. అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్ మరియు ఫస్ట్ ఫ్లోర్ పనులను వేగవంతముగా చేసి త్వరితగతిన పూర్తి చేయవలసినదిగా ఆదేశాలు జారిచేసినారు. ఆగస్ట్ వరకు గ్రౌండ్ ఫ్లోర్ మరియు ఫస్ట్ ఫ్లోర్ రెండు కుడా ఓపెనింగ్ చేయాలనీ ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించడమైనది. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ప్రభాకరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర రెడ్డి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News