Breaking News

ప్రజల నుండి అందే దరఖాస్తులు 48 గంటల్లో పరిష్కారం కావాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని జనన, మరణ నమోదు కేంద్రంలో ప్రజల నుండి అందే దరఖాస్తులు 48 గంటల్లో పరిష్కారం కావాలని, నెలల తరబడి పెండింగ్ లో ఉంటే సంబందిత సిబ్బందిపై చర్యలు తప్పవని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. శనివారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని జనన మరణ నమోదు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, కొన్ని అర్జీలు నెలల తరబడి పెండింగ్ ఉండడం గమనించి ఆగ్రహం వ్యక్తం చేసి, తక్షణం విభాగ డేటా ఎంట్రీ ఆపరేటర్లను మరో విభాగానికి బదిలీ చేయాలని మేనేజర్ ని ఆదేశించారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత జనన మరణ నమోదు కేంద్రంలో సిబ్బంది సకాలంలో హాజరు కాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రజల నుండి అందిన ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, కొన్ని నెలల తరబడి పెండింగ్ లో ఉండడం గమనించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుండి విభాగానికి అందే అర్జీలు 48 గంటల్లోగా పరిష్కారం జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు పెండింగ్ దరఖాస్తులు 2 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. విభాగంలోని డేటా ఎంట్రీ ఆపరేటర్లను మరో విభాగానికి బదిలీ చేసి, నూతన ఆపరేటర్లను కేటాయించాలని మేనేజర్ ని ఆదేశించారు. విభాగంలో ప్రజలకు జవాబుదారీతనంతో సిబ్బంది వ్యవహరించాలని, జనన, మరణ ధృవ పత్రాలు అత్యావశ్యకమని, అటువంటి ధృవ పత్రాలు అందించే విభాగం పనితీరు మెరుగు పరుచుకోవాలని, నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకోక తప్పదని స్పష్టం చేశారు. అర్జీల క్షేత్ర స్థాయిలో పరిశీలనను శానిటేషన్ కార్యదర్శులు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *