-నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలోని 3 వంతెనల వద్ద 700ఎంఎం డయా సిఐ పైప్ లైన్ మరమత్తు పనులను నిర్దేశిత గడువుకి ముందే పూర్తి చేయాడానికి ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. గురువారం కమిషనర్ 3 వంతెనల వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి, పనుల వేగవంతంపై ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పైప్ లైన్ మరమత్తు పనుల వలన నాజ్ సెంటర్ (ఎల్ఎల్ఆర్) రిజర్వాయర్ పరిధిలో పలు ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాలో అంతరాయం కల్గుతుందని, పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పనుల వేగవంతంకు రాత్రి సమయంలో చేయడానికి తగిన లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. పనులకు రైల్వే అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు.
పర్యటనలో ఈఈ సుందర్రామిరెడ్డి, డిఈఈ కళ్యాణరావు, ఏఈ మధు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News