గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
వికలాంగులకు పెట్రోల్ మంజూరుకై దృవీకరణ కోసం బాలకృష్ణ అందించిన అర్జీని పరిశీలించి, తగు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఉపా సెల్ పిఓని ఆదేశించారు. గురువారం నగరపాలక సంస్థ కమిషనర్ కార్యాలయంలో ఆర్.అగ్రహారం నివాసి వికలాంగులుడైన టి.బాలకృష్ణ కమిషనర్ ని కలిసి స్వయం ఉపాధి చేసుకుంటూ, వికలాంగ కోటాలో ప్రభుత్వం మంజూరు చేసిన 3 చక్రాల వాహనంకు పెట్రోల్ మంజూరు కోసం ద్రువీకరణ పత్రం కోసం అర్జీ అందించారు. స్పందించిన కమిషనర్ తక్షణం సదరు అర్జీని క్షేత్ర స్థాయిలో పరిశీలించి, త్వరితగతిన తగు చర్యలు తీసుకోవాలని ఉపా సెల్ పిఓని ఆదేశించారు.
Prajavartha Online Telugu News