మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
సాయుధ దళాల పతాక నిధి సేకరణలో కృష్ణాజిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచిందని జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి సర్జన్ లెఫ్ట్నెంట్ కల్నల్ డాక్టర్ కే. కళ్యాణ వీణ శుక్రవారం తెలిపారు. ఇందుకు సంబంధించి డిసెంబర్లో రాష్ట్ర గవర్నర్ గారి చేతుల మీదుగా మెమెంటో తీసుకోవలసి ఉండగా, అనివార్య కారణాలవల్ల ఆ కార్యక్రమం రద్దు కావడంతో, ఆ మెమెంటోను శుక్రవారం కలెక్టరేట్లో జిల్లాకలెక్టర్ డీకే బాలాజీ ని కలిసి జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి అందజేశారు. ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్ 2025 క్యాలెండర్ కలెక్టర్ గారికి అందజేశారు.
Tags machilipatnam
Check Also
మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …
Prajavartha Online Telugu News