గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణానికి సంబందించి గుంటూరు నగరపాలక సంస్థ నుండి చేపట్టాల్సిన ప్రభావిత భవనాల తొలగింపు, కాంపౌండ్ వాల్ నిర్మాణం, టిడిఆర్ బాండ్లు, నష్ట పరిహారాల పంపిణీ ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులు సమన్వయంతో పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. గురువారం కమీషనర్ తమ చాంబర్ లో ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులకు శంకర్ విలాస్ ఆర్ఓబి పనులపై జిఎంసి చేపట్టాల్సిన పనులపై తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ శంకర్ విలాస్ ఆర్ఓబి పనులు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున జిఎంసి నుండి చేపట్టాల్సిన రోడ్ విస్తరణ పనులను, ప్రభావిత భవనాల తొలగింపు పూర్తి చేయాలన్నారు. భవనాల తొలగింపు అనంతరం ఇరువైపులా కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టడానికి అంచనాలు సిద్దం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. 26 మందికి తాము కోల్పోతున్న భవనాలకు సంబందించి నష్ట పరిహారం అందించడానికి ప్రతిపాదనలు 25వ తేదీకి పూర్తి చేయాలని ఎస్ఈని ఆదేశించారు. అలాగే ఆయా ప్రాంతాల్లో టిడిఆర్ బాండ్లు ఇవ్వాల్సిన వాటికి ప్రాసెస్ మొదలు పెట్టాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. తొలుత ఇంజినీరింగ్ విభాగంలో అధికారుల వారీగా పెండింగ్ లో ఉన్న ఈ-ఆఫీస్ ఫైల్స్ ని 2 రోజుల్లో క్లియర్ చేయాలని, డిఈఈలు, ఈఈలు భాధ్యత తీసుకోవాలన్నారు.
సమావేశంలో ఎస్ఈ నాగ మల్లేశ్వరరావు, ఈఈలు సుందర్రామిరెడ్డి, కోటేశ్వరరావు, డిసిపి సూరజ్ కుమార్, ఏసిపిలు రెహ్మాన్, వెంకటేశ్వరరావు, చంద్రశేఖర్, డిఈఈలు, ఏఈలు, టిపిఎస్ లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News