Breaking News

స్థానిక వార్డ్ సచివాలయం హౌస్ హోల్డ్ డేటాలో తప్పనిసరిగా నమోదై ఉండాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ నిబందనల మేరకు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో నివాసం ఉండే ప్రతి ఒక్కరూ స్థానిక వార్డ్ సచివాలయం హౌస్ హోల్డ్ డేటాలో తప్పనిసరిగా నమోదై ఉండాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మిస్సింగ్ సిటిజన్ సర్వే చేపట్టిందని, అందులో భాగంగా నగరంలో నివసించే ప్రతి ఒక్కరినీ స్థానిక వార్డ్ సచివాలయం పరిధిలో హౌస్ హోల్డ్ డేటాలో నమోదు చేయడం జరుగుతుందన్నారు. డేటాలో ప్రభుత్వ ఉద్యోగులతో సహా నగరంలోని ప్రతి ఒక్కరూ నమోదు కావాల్సి ఉంటుందన్నారు. భవిష్యత్ లో భూ పట్టాలు, అడంగల్, పట్టాదారు పాసు పుస్తకాలు, పాస్ పోర్ట్, ఆధార్ సేవలు, పుర సేవలు అందడానికి హౌస్ హోల్డ్ డేటాలో నమోదు తప్పనిసరి అని అన్నారు. ప్రభుత్వ సేవలు, సమాచారం, సంక్షేమ పధకాలు అందించడానికి కూడా డేటా ప్రధానమైనదని తెలిపారు. అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటి, గ్రూప్ హౌస్ ల్లో ఉండేవారిలో ఎక్కువ మంది మిస్సింగ్ సిటిజన్ కేటగిరిలో ఉన్నారని, అటువంటి వారు తమ వద్దకు వచ్చే సచివాలయ కార్యదర్శులకు తగిన సమాచారం అందించి సహకరించడం ద్వారా హౌస్ హోల్డ్ డేటాలో నమోదు కావాలని, సదరు నమోదుపై ఏ విధమైన అపోహలు పెట్టుకోవద్దని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *