-మార్చి 20 న వికాస ఆధ్వర్యంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మార్చ్ 20 వ తేదీ గురువారం ఉదయం “వికాస” ఆధ్వర్యంలో తూర్పు గోదావరీ జిల్లా కలెక్టరేట్ లో “జాబ్ మేళా” నిర్వహిస్తున్నట్లు” వికాస “ప్రాజెక్ట్ డైరెక్టర్ కే.లచ్చారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళలో జి ఎస్ ఎల్ ఆసుపత్రి నందు స్టాఫ్ నర్స్, హాస్టల్ మేనేజర్, ల్యాబ్ టెక్నీషియన్, ఎంసివి మోటో కార్పొ లో జి యమ్, మేనేజర్, అకౌంటెంట్, సేల్స్ ఎక్సక్యూటివ్ , మహిళలకి ప్రత్యకంగా ఫోక్సకాన్ హైదరాబాద్ నందు ఆపరేటర్ , ఇండో ఎంఐఎం, పానాసోనిక్, హ్యుండయి కంపెనీలలో టెక్నిషియన్, ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఉద్యోగాలకు ఎస్.ఎస్.సి, ఇంటర్, ఐ.టి.ఐ, డిప్లొమో, & నర్సింగ్, జి ఎన్ ఎం,డిగ్రీ, ఎం బి ఏ,బిటెక్ ఉత్తీర్ణులైన 30 సంవత్సరాల లోపు అభ్యర్థులు అర్హులు. వీరి అర్హత మేరకు నెలకు రూ.10,000/- నుండి రూ. 40,000/ వరకు జీతం మరియు ఇన్సింటివ్స్, భోజనం, వసతి & రవాణా సౌకర్యం ఆయా ఉద్యోగాలకు అనుగుణంగా ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులందరూ ఈనెల 20 వ తేదీ గురువారం ” కలెక్టరేట్ “(బొమ్మూరు హార్లీక్స్ ఫ్యాక్టరీ ఎదురుగా) రాజమహేంద్రవరం” వద్ద ఉదయం 9.30 గంటలకు విద్యా అర్హతల సర్టిఫికెట్స్, జెరాక్స్ కాపీ ల తో నేరుగా హాజరుకావలెనని తెలిపారు. మరిన్ని వివరాలకు www.vikasajobs.com లేదా ఫోన్ నంబర్ 7660823903 ను సంప్రదించాలని ఆయన కోరారు.