విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర యవజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా ఎనికెపాడు విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ కాలేజీలో షాహిదీ దివాస్ అమరవీరుల దినోత్సవం మార్చి 23 1930 భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ,లను బ్రిటిష్ వారు ఉరితీసిన సందర్భంగా ఈ కార్యక్రమం జరుపుకోవడం స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా యువ అధికారి సుంకర రాము మాట్లాడుతూ స్వాతంత్రం కోసం పోరాడిన యోధులు ఎందరో ఉన్నారని వారిలో గుర్తింపబడిన వ్యక్తులుగా భగత్ సింగ్ ప్రామాణికమని అతనితొ పాటు రాజ్ గురు సుఖదేవ్ వంటి వారు కూడా ఆరోజు స్వాతంత్ర సమరం లొ పాల్గొని బ్రిటిష్ వారి చేతి లొ ఉరికంభం పొందారని వారిని స్మరించుకుంటూ ఈరోజును గుర్తించుకుంటూ షాహేది దివాస్ అనే కార్యక్రమం జరుపుకుంటున్నామని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సిఎస్సి హెచ్ ఓ డి సి విష్ణు ప్రియ మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మధుశ్రీ విద్యార్థులు యువత పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News