విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు సాహిత్య ఔన్నత్యం మహోన్నతం అని ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు, తెలుగు భాషా ఉద్యమ సర్వ సైన్యాధ్యక్షుడు, ఉమ్మడి రాష్ట్ర అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షులు, ఉ మ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, అవనిగడ్డ ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. బుధవారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ప్రముఖ రచయిత్రి కోనేరు కల్పన రచించిన “కంద పిలకలు” తెలుగు సంవత్సరాల శతకం ఆవిష్కరణ మహోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిధిగా, శతక ఆవిష్కర్తగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విచ్చేసి శతకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయనను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.
Prajavartha Online Telugu News