Breaking News

శ్రీ మహంకాళీ అమ్మవారి దేవస్థానం పున:ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్

-ఘనస్వాగతం పలికిన ఆలయ అధికారులు, స్థానిక నాయకులు

దుగ్గిరాల, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం కంఠంరాజ కొండూరు గ్రామంలో నిర్వహించిన శ్రీ మహంకాళీ అమ్మవారి దేవస్థానం పున:ప్రతిష్ట మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు అధికారులు, స్థానిక నాయకులు మంగళవాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయ పున:ప్రతిష్టను పురస్కరించుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక సారె, పసుపు, కుంకుమ, గాజులు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ రాకను పురస్కరించుకుని అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. జ్ఞాపికను బహూకరించారు. అనంతరం ఆలయంలో నూతనంగా నిర్మించిన శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి లోకేష్ రాకను పురస్కరించుకుని స్థానిక ప్రజానీకం పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనూరాధ, పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌ నందం అబద్దయ్య, టీటీడీ సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, టీడీపీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, టీడీపీ మండల అధ్యక్షురాలు కేసమనేని అనిత తదితరులు పాల్గొన్నారు.

మార్గమధ్యలో బకింగ్ హోం కాలువను పరిశీలించిన మంత్రి లోకేష్
శ్రీ మహంకాళీ అమ్మవారి దేవస్థానం పున:ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని ముగించుకుని మంగళగిరికి పయనమైన మంత్రి లోకేష్ మార్గమధ్యలో కాజ-చినవడ్లపూడి మధ్యలో గల బకింగ్ హోం కాలువను పరిశీలించారు. కాలువలో పెద్దఎత్తున గుర్రపు డెక్క పూడుకుపోవడాన్ని గమనించారు. వర్షాకాలంలో రైతులకు ఇబ్బందులు కలుగకుండా గుర్రపు డెక్కను తొలగించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *