Breaking News

మంగళగిరిలో శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్

మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
సగర భగీరథ సంఘం ఆధ్వర్యంలో మంగళగిరి గౌతమ్ బుద్ధా రోడ్డులో నిర్వహించిన శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గౌతమ్ బుద్ధా రోడ్డులోని శ్రీ భగీరథ మహర్షి విగ్రహాన్ని సందర్శించి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా జై భగీరథ అంటూ స్థానికులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. మంత్రి నారా లోకేష్ రాకను పురస్కరించుకుని స్థానికులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌ నందం అబద్దయ్య, టీటీడీ సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, టీడీపీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *