-రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘo
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పాకిస్థాన్ తో యుద్ధానికి ఆంధ్ర ప్రదేశ్ లోని మాజీ సైనికులు సిద్ధoగా ఉన్నారని రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘ అధ్యక్షులు మోటూరు శంకరరావు అన్నారు.గుంటూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ మాజీ సైనికులు సంక్షేమ సంఘ అనుబంధ విభాగo శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు సైనికులను యుద్ధభూమికి పంపించవలసిoదిగా ప్రధాని మోడీ ని కోరారు.దీనికోసం ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు భారత రక్షణ శాఖతో చర్చించి యుద్ధభూమికి పంపించవలసిందిగా ఆయన కోరారు.ఆంధ్రప్రదేశ్ లోని 685 మండలాల్లో లక్షమంది మాజీ సైనికులున్నారని రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఐనంపూడి రత్న ప్రసాద్ తేలిపారు.ఇందులో 25 వేలమంది మాజీ సైనికులు పాకిస్థాన్ తో యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఉపాధ్యాక్షులు పుసులూరు లక్ష్మీనారాయణ మాట్లాడు తు భారత దేశం మీసం తిప్పిందని శత్రువులను పారద్రోలెందుకు పౌరుషం పరుగు తీస్తుందన్నారు. సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సేక్రెటరి వాకా ఆదినారాయణ ఎo.చిన కొండల రావు తడితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News