విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి ను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ (అన్న) టీడీపీ సీనియర్ నాయకులు యలమంచిలి శ్రీనివాస్ లు పరామర్శించారు. లండన్ పర్యటనలో ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో సుజనా చౌదరి కుడి భుజానికి శస్త్ర చికిత్స జరగడంతో వైద్యుల సూచనల మేరకు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసంలో మంగళవారం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ (అన్న) టీడీపీ సీనియర్ నేత యలమంచిలి శ్రీనివాస్ పరామర్శించారు. సుజనా ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News