విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి ను మాజీ ఎమ్మెల్యే, ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయభాను, మంగళవారం పరామర్శించారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడిన సుజనా చౌదరి కు వైద్యులు సర్జరీ చేసి విశ్రాంతి తీసుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు ఆయనను పరామర్శించేందుకు వస్తున్నారు. విషయం తెలుసుకున్న సామినేని ఉదయభాను జనసేన నేతలతో కలిసి హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి పరామర్శించారు. సుజనా ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఉదయభాను ఆకాంక్షించారు. జనసేన నేతలు సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్, గంజి పవన్, సమతం సత్తిబాబు, 99 టీవీ సీ. ఈ. ఓ కోడూరు గణేష్, జర్నలిస్ట్ బ్రహ్మనాయుడు తదితరులు ఉదయభానుతో కలిసి పరామర్శించారు.
Prajavartha Online Telugu News