– ఈ నెల 27న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ..
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 27వ తేదీ సోమవారం కలెక్టరేట్లో ప్రజా స్నేహపూర్వక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం … పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని.. అదే విధంగా అర్జీదారులు తమ స్పందన తెలియజేసేందుకు ప్రత్యేక క్యూఆర్ కోడ్ను అందుబాటులో ఉంచినట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు పీజీఆర్ఎస్ సేవలు పొందిన వెంటనే తమ మొబైల్ ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి అ భిప్రాయాలు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. ప్రజా స్నేహపూర్వక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంతో పాటు డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. అదేవిధంగా అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చని .. నమోదైన అర్జీల స్థితి, సంబంధిత సమాచారం తెలుసుకునేందుకు 1100 కి నేరుగా కాల్ చేయవచ్చని కలెక్టర్ సూచించారు.
Prajavartha Online Telugu News